అనంత్, రాధిక విడాకులు ఖాయం..ఆ భారం భరించలేకనే ?

Veldandi Saikiran
రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు రూ. 5వేల కోట్ల రూపాయలకు ఖర్చుతో ఈ వివాహం జరిగిందంటూ అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా ముకేశ్ అంబానీ తన కుమారుడి వివాహాన్ని జరిపించారు. వీరి వివాహానికి దేశ విదేశాల నుంచి వ్యాపార, రాజకీయ, సినీ హైదరాబాద్ చెందిన ప్రముఖులందరూ పాల్గొన్నారు.

స్టార్ నటినటులు అందరూ కలిసి ఈ వివాహానికి వచ్చి సందడి చేశారు. ఇక ఈ వివాహానికి వచ్చిన వారందరూ అనంత్ అంబానీ, రాధికలను దీవించి ఎప్పుడు ఇలానే సంతోషంగా కలిసి ఉండాలని ఆశీర్వదించారు. ఇక వారితో ఫోటోలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆ ఫోటోలను వారి వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. తాజాగా పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ ఓ షాకింగ్ పోస్ట్ చేశాడు.

అనంత్ అంబానీ, రాధిక వివాహం గురించి దారుణంగా పోస్ట్ చేశాడు. ఈరోజుల్లో వివాహ వేడుకలు ఎంతో గ్రాండ్ గా చేసుకుంటున్నప్పటికీ.... కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడడం లేదంటూ ఓ పోస్ట్ ని షేర్ చేశాడు. అంతేకాకుండా అనంత్, రాధికల ఫోటోలు షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజెన్లు అర్సలన్ నజీర్ తీరుపై మండిపడుతున్నారు.
వారు ఎంతో ప్రేమతో....శుభమా అంటూ సంతోషంగా పెళ్లి చేసుకుంటే.... విడిపోతారని అలా దారుణంగా కామెంట్లు చేస్తావేంటి అని అతనిపై మండిపడుతున్నారు. వారు చిన్ననాటి నుంచి స్నేహితులు. వారి ప్రేమలో ఎంతో నిజాయితీ ఉంది. అందుకే వారి ప్రేమను నిలబెట్టుకున్నారు. లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. మధ్యలో నీకేంటి సమస్య? అని పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: