ఏపీ: ఆంక్షల నడుమ జగన్ కాన్వాయ్..చావు రాజకీయాలు చేయొద్దంటూ నేతలు...?

FARMANULLA SHAIK
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా హత్యకు గురైన షేక్‌ రషీద్‌ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇపుడే వినుకొండకు చేరుకున్నారు.అయితే ప్రస్తుతం వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పష్టం చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్ మోహ్మన్ రెడ్డి వచ్చి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చునని క్లారిటీ ఇచ్చారు. కానీ జన సమీకరణతో ప్రదర్శనలు చేయవద్దని, ప్రస్తుతం వినుకొండ పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అనవసరంగా ఎవ్వరూ రోడ్లు పైకి రావద్దని ఆయన పిలుపునిచ్చారు.అయితే వినుకొండకు చేరుకున్న మాజీ సీఎం జగన్ కాన్వాయ్ పై ఆంక్షలు విధించి ఆయన వెంట ఉన్న పార్టీ నేతలను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వైయస్ జగన్ తో పాటు వినుకొండ బయలుదేరిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ నేతల కార్లు వైయస్ జగన్ వెంట వెళ్లకుండా నియంత్రించారు.తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో పార్టీ నేతల వాహనాలను పోలీసులు ఆపేశారు. ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన పోలీసులు సరిగ్గా నడవని బీపీ వాహనం బాగోకపోవడంతో ప్రైవేట్ వాహనం లో వినుకొండ వెళ్తున్నారు వైయస్ జగన్. పోలీసులు తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.అయితే జగన్ వినుకొండ ప్రయాణానికి టీడీపీ నేతలు దీన్ని రాజకీయం చేయొద్దని దినంతటికి పాత గొడవలే కారణమని అంటున్నారు.హతుడు షేక్ రషీద్, హంతకుడు షేక్ జిలానీ ఇద్దరూ గతంలో మిత్రులే. ఇద్దరూ గతంలో ఖాన్‌ ముఠాలో సభ్యులే. అయినప్పటికీ 'చావు రాజకీయం' చేయడం కోసమే మాజీ సీఎం జగన్ ఇవాళ వినుకొండ వచ్చారని అన్నారు.ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలకమైన ప్రకటన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: