వల్లభనేని కెరీర్‌ క్లోజ్‌..ఇక రాజకీయ సన్యాసమే ?

Veldandi Saikiran
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కష్టాలు మొదలు అయ్యాయి. టీడీపీ తరఫున రెండుసార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ మూడోసారి వైసీపీ బి ఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయారు. రెండోసారి అంటే 2019లో టీడీపీ బీఫామ్ మీదే గెలిచి తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి జై కొట్టారు ఆయన. ఆ తర్వాత ఐదేళ్లపాటు చంద్రబాబు, లోకేష్ పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు వంశీ. ఒక దశలో అవి శృతిమించి అవతలి వాళ్ళు భరించలేనంత వ్యక్తిగత వ్యవహారాల వరకు వెళ్లాయి.

నోటికి అదుపు లేకుండా పోయి మాటలు మరి దిగజారిన క్రమంలో టిడిపి హిట్ లిస్ట్ లో చేరారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే. దీంతో ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున విజయవాడలో ఉన్న వంశీ ఇంటికి వెళ్లి దాడికి ప్రయత్నించారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఆ ఘటన. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గానికి దూరమయ్యారట వల్లభనేని. అప్పటినుంచి లోకల్ గా ఎక్కడ కనిపించడం లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు సైతం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత వంశీపై కేసును నమోదు చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి ఘటనలో నిందితుడిగా ఆయన పేరును చేర్చడంతో పాటు మరికొంతమంది అనుచరులను బుక్ చేశారు.
ఇక తాజాగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో తొలిసారి అధికారులతో కలిసే ప్రజాదర్బార్ నిర్వహించారు. అందులో కూడా వంశీ అనుచరులపై భారీగా ఫిర్యాదులు అందాయట. మట్టి తవ్వకాల్లో అక్రమాలు, ఎస్సీల భూముల ఆక్రమణ, నకిలీ పత్రాలతో ఇతరుల భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లాంటి రకరకాల ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలిసింది. ఇప్పుడు వాటన్నింటినీ పరిశీలించి కేసు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇకపై వంశీతో పాటు ఆయన అనుచరులపై కూడా వరుస కేసులో ఉంటాయన్న చర్చ జరుగుతోంది. తన ఇంటి మీద దాడి ప్రయత్నం జరిగినప్పటి నుంచి అందుబాటులో లేరట వంశీ.
నియోజకవర్గానికి దూరంగా ఉంటూనే తన అనుచరులపై వరుసగా కేసులు నమోదవడం.... కొందరు అరెస్ట్ అవ్వడం లాంటి పరిణామాలు పరిణామాలను తెలుసుకుంటున్నారట. అలాగే అతనితో అత్యంత సన్నిహితంగా ఉండే కొందరితో తరచుగా మాట్లాడుతూ స్థానిక పరిస్థితుల మీద అవగాహనకు వస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో తాను తిరిగి గన్నవరం వస్తానని....ఆందోళన చెందవద్దని క్యాడర్ కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ ఆ మాటలు వారిలో ధైర్యం నింపలేకపోతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: