ఏపీ: డెలివరీ బాయ్ ఇంట్లో మైనర్ బాలిక మృతి..!

Divya
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 10 రోజుల క్రితం వరుస చిన్నపిల్లల అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి.. ఇటీవలె మైనర్ బాలికను కూడా ముగ్గురు మైనర్స్ బాలురు అత్యాచారం చేసి చంపారు.. ఈ ఘటన మరువకముందే గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్త రెడ్డి ప్రాంతానికి చెందిన శైలజ అనే బాలికను అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎస్సీ బాలిక శైలజ ఈమె అన్నయ్య సోమవారం రోజున ఉదయం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారట. స్కూల్ అయిపోగానే  బాలిక శైలజ అన్నయ్య బాలుడొక్కడే ఇంటికి తిరిగి వచ్చారట.

అయితే ఇంటికి వచ్చిన ఈ బాలుడిని తమ తల్లిదండ్రులు చెల్లి ఏది అని ప్రశ్నించగా.. దీంతో వెంటనే పాఠశాలకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయులను తన చెల్లెలు శైలజ గురించి అడగగా.. తన చెల్లెలు ఒంట్లో బాగోలేదని శైలజ మధ్యాహ్నమే వెళ్ళిపోయిందంటూ అక్కడ ఉపాధ్యాయులు చెప్పారు.. దీంతో తల్లి కుమారుడి ఇద్దరు కలిసి ఊరంతా వెతకగా ఈ క్రమంలోనే గ్యాస్ డెలివరీ భాయ్ నాగరాజు ఇంటి వద్ద తన చెల్లెలు శైలజ కాలి చొప్పులను గుర్తించారు.. కిటికీలో నుంచి చూడగా శైలజ గదిలో విగతాజీవిగా మారిపోయినట్టు చూసిన తల్లి , కుమారుడు  ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు.

వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు సైతం గుంటూరులో జిజిహెచ్కి తరలించారు. దీంతో అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు సైతం తెలియజేశారు. అయితే బాలికను హత్య చేసిన నిందితుడు నాగరాజును సైతం కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేశారు. అలాగే ఒంటరిగా బడి నుంచి బయటికి పంపించినటువంటి ఉపాధ్యాయుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు నాగరాజుకి అప్పటికే వివాహమై భార్యతో విభేదాలు కారణంగా మూడేళ్లుగా ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నారని అక్కడ స్థానికులు వెల్లడించారు. ప్రస్తుతం నాగరాజు పరారీ లో ఉన్నట్లు సమాచారం. ఏపీలో మరి ఇలాంటి దారుణాల పైన ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: