సాక్షికి షాక్‌.. కొత్త ఛానెల్‌ పెడుతున్న సాయిరెడ్డి?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు.. విజయసాయిరెడ్డి చుట్టూ ఓ వివాదం తిరుగుతోంది. ఏపీ దేవాదాయ శాఖలో పనిచేసే శాంతి అనే యువతి తో విజయసాయిరెడ్డి సంబంధం పెట్టుకున్నాడని... ఆమె మాజీ భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేస్తూ... బయటకు వచ్చారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారులకు... శాంతి పై ఫిర్యాదు చేశారు మదన్ మోహన్. అయితే... ఈ ఆరోపణలపై... తాజాగా రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి స్పందించారు.
ఏపీ అధికారి శాంతికి... తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఎల్లో మీడియా కావాలనే తన పైన బురద జల్లుతోందని నిప్పులు చెరిగారు. ముఖ్యంగా టీవీ5, మహా న్యూస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి... చానళ్లకు వార్నింగ్ ఇస్తూ రెచ్చిపోయారు...  విజయ సాయి రెడ్డి. అంతేకాదు.. విజయసాయిరెడ్డి మరో ప్రకటన చేశారు. త్వరలోనే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని వెల్లడించారు. గతంలోనే ప్రకటించిన ఆలస్యం చేసినందుకు బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.  ఎవరు అడ్డువచ్చిన ఛానల్ ఏర్పాటు లో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.

కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా న్యూట్రల్ ప్లాట్ ఫార్మ్ మీద పని చేస్తుందని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. తప్పులు చేసే వాళ్ళను వదలబోమని... ప్రజల అవసరాల కోసం, ప్రభుత్వ అస్తుల రక్షణ కోసం పనిచేశానని వివరించారు. గడిచిన మూడు రోజులుగా మీడియా ట్రోలింగ్, కథనాలు ఒక ఆదివాసీ మహిళ ను అవమానించారని ఫైర్‌ అయ్యారు.

నిరాధారమైన వార్తలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధమన్నారు. ఇది ఘోరమైన తప్పిదమంటూ రెచ్చిపోయారు. నా మీద దారుణంగా రాతలు రాసిన వాళ్ళతో ఎలా క్షమాపణలు చెప్పించాలో నాకు తెలుసు అన్నారు విజయసాయిరెడ్డి. నా మీద కుట్రలు బయటపెడతానన్నారు. విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా వుంటుందో చేసి చూపిస్తానని హెచ్చరించారు రాజ్యసభ సభ్యుడు.. విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: