శాంతి ఎపిసోడ్ వెనుక వైసీపీ నేతల కుట్రలు...విజయసాయి సంచలనం ?

Veldandi Saikiran
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్‌ పై రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి స్పందించారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురదజల్లేడం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోందని మీడియాతో వెల్లడించారు. నా పరువు తీసేందుకు ప్రయత్నం చేశారో అది మా వైసీపీ పార్టీ వాళ్ళైనా, ఇతర పార్టీల వాళ్లైన వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు విజయసాయిరెడ్డి. నిన్న మా ఇంటికి ఒక తెలుగుదేశం గూండా వచ్చి విజయసాయిరెడ్డి ఎక్కడ అని అడిగాడట అంటూ ఆగ్రహించారు.

నేను సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాను..నా ఇంటికి వచ్చి భయపెట్టే తాటాకు చప్పుళ్లకు లొంగేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో కుమ్మక్కై మా వైసీపీ పార్టీ వాళ్ళే నా మీద ఆరోపణలు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ సాయిరెడ్డి. అయినా నేను బాధపడలేదని వెల్లడించారు. సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే మనిషి కాదని క్లారిటీ ఇచ్చారు.

తప్పు చేయను వేంకటేశ్వర స్వామికి తప్ప ఎవ్వరికీ భయపడనని తేల్చి చెప్పారు రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి. మూడు రోజులుగా మీడియా ట్రోలింగ్, కథనాలు ఒక ఆదివాసీ మహిళ ను అవమానించారని మండిపడ్డారు.  నిరాధారమైన వార్తలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధమని ఆగ్రహించారు. ఇది ఘోరమైన తప్పిదమని నిప్పులు చెరిగారు. నా మీద దారుణంగా రాతలు రాసిన వాళ్ళ  తో ఎలా క్షమాపణలు చెప్పించాలో నాకు తెలుసన్నారు.

నా మీద కుట్రలు బయటపెడతాను..విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా వుంటుందో చేసి చూపిస్తానని హెచ్చరించారు రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి. మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ళ తోకలు కత్తిరించడం ఖాయమని హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో tdp గూండాలు, కార్యకర్తలు ఆకృత్యాలు పెరిగిపోయాయని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: