పవన్ కళ్యాణ్ భారీ ప్లాన్...9 వేల జీతంతో 2.40 మందికి ఉపాధి...?

Veldandi Saikiran
ఏపీ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. SLRM ప్రాజెక్టుపై తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు పవన్‌ కళ్యాణ్‌.
పంచభూతాల్లో నీరు ఉందని... కానీ ఆ నీటిని మనం పూజలకే ఉపయోగిస్తాం తప్ప.. నీటిని శుభ్రంగా ఉంచాలని కోరారు. 12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే చెత్తే సంపద అవుతుందని వివరించారు పవన్‌. పనికి రాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుందని స్పష్టం చేశారు జనసేనాని. శ్రీనివాసన్ గత 2 దశాబ్దాలుగా SLRM ప్రాజెక్టు మీద పని చేస్తున్నారని కొనియాడారు.

పిఠాపురంలో తొలిసారిగా SLRM ప్రాజెక్టు చేపట్టనున్నామని ప్రకటించారు పవన్‌. ప్రజలూ SLRM ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కోరారు. పంట కాల్వ కన్పిస్తే చాలు దాన్ని డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారని... ఈ ప్రాజెక్టుపై అవగాహన పెంచేందుకు మాస్టర్ ట్రైనర్సును సిద్దం చేస్తామని వెల్లడించారు. SLRM ప్రాజెక్టును నా కార్యాలయంలో.. మా పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తామని తెలిపారు పవన్. SLRM ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాల్టీలకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.

SLRM ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే రూరల్ ప్రాంతంలో ఏడాదికి  రూ. 2600 కోట్ల ఆదాయం వస్తుందని ప్రకటించారు. 2.45 లక్షల మందికి రూ. 9 వేల జీతం ఇచ్చి ఉపాధి కల్పించవచ్చని వెల్లడించారు పవన్‌ కళ్యాణ్‌. ఇప్పటి వరకు చిన్న చిన్న  గ్రామాల్లో మాత్రమే అమలు చేశారు.. ఈ ప్రాజెక్టుకు మరింత విస్తృతి కల్పించాలని ఆదేశించారు. పంచాయతీలకు డబ్బులు లేవని... పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు.. ప్రక్షాళన చేయాలని ఆదేశించారు.

స్వయం సమృద్ధి ఉండేలా పంచాయతీలను రూపొందించాల్సి ఉంటుందని తెలిపారు. భీమవరం డంపింగ్ యార్డ్ విషయంలో కూడా SLRM ప్రాజెక్టు అమలు చేస్తామని ప్రకటించారు. భీమవరం మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటుంది.. ఈ ప్రాజెక్టు అమలు విషయమై మంత్రి నారాయణతో మాట్లాడుతామని వివరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: