కేసీఆర్‌ అదిరిపోయే ప్లాన్‌..కడిగిన ముత్యంలా బయటకు రానున్న కవిత?

Veldandi Saikiran
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత  ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో జైలు జీవితాన్ని గడుపుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కామ్ లో భాగంగా కల్వకుంట్ల కవిత అనేక ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలు అయ్యారు. మార్చి 15వ తేదీన ed అధికారులు కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారు. హైదరాబాదులోని ఆమె నివాసంలో అరెస్టు..  చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు.
దీంతో కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు... ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. అప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు... కూతురి విషయంలో కూడా ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 115 రోజులుగా... ఢిల్లీలో ఉన్న తీహార్ జైల్లో జైలు జీవితం అనుభవిస్తున్నారు కల్వకుంట్ల కవిత. తిహార్ జైల్లో ఉన్న... కల్వకుంట్ల కవితను సిబిఐ కేసులు కూడా వేధిస్తున్నాయి.
ఇక ఈ 115 రోజులుగా... బెయిల్ కోసం కల్పకుంట్ల కవిత చేయని ప్రయత్నం లేదు. అయితే ఎక్కడా కూడా బెయిల్ రాలేదు. ఇలాంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కోసం గులాబీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డిఫాల్ట్ బెయిల్ కోసం... గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తూ అందట. ఈ బెయిల్ ప్రకారం కవితకు కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె న్యాయవాదులు కూడా చెబుతున్నారు. ఒక నిందతుడి నేరాన్ని బట్టి కస్టడీ.. గడువు అప్పుడప్పుడు గరిష్టంగా ఉంటుంది. ఆ కస్టడీ ముగిసిన కూడా బెయిల్ రాకపోతే మనం డిఫాల్ట్ బెయిల్.. కోసం కోర్టును ఆశ్రయించవచ్చు.

పదేపదే కోర్టును ఆశ్రయించిన బెయిల్ రాకపోతే... ఈ డిఫాల్ట్ బెయిల్ ద్వారా... నిందితుడు బయటపడవచ్చు. ఇప్పుడు కవిత విషయంలో కూడా డిఫాల్ట్ బెయిల్ కోసం.. గులాబీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట.  అందులో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు... తాజాగా ఢిల్లీకి వెళ్లారు. మన వారం రోజుల్లోపు కవిత బయటికి వచ్చే ఛాన్స్ ఉందట. మరి గులాబీ నేతల ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: