ఏపీ: 39 ఏళ్ల నిరీక్షణకు తెర.. మంత్రి పదవితో ఆ నియోజకవర్గ ప్రజలు ఖుషి..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్ కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ మంత్రివర్గంలో పయ్యావుల కేశవ్ కూడా చోటు సంపాదించుకున్నారు. ఆయన రాజకీయాల్లో 30 ఏళ్ల తర్వాత మంత్రి అయ్యారు. 1994లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వై.శివరామిరెడ్డిపై విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో ఓడిపోయినా 2004, 2009లో గెలిచారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో పయ్యావుల మళ్లీ ఓడిపోయారు. 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. కేశవ్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎట్టకేలకు చంద్రబాబు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిని చేశారు. 1994 నుంచి 2024 వరకు జరిగిన ఏడు సాధారణ ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే ఓడిపోయారు.
1994 ఎన్నికల్లో కేశవ్ తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1999 ఎన్నికల్లో కేశవ్ ఓడిపోయినా టీడీపీ గెలిచింది. 2004, 2009లో మళ్లీ గెలిచినా, కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. 2014లో టీడీపీ గెలిచినా కేశవ్ ఓడిపోయారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలుపొందడంతో గతంలో ఉన్న ట్రెండ్‌ను తుంగలో తొక్కి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
39 ఏళ్ల తర్వాత ఉరవకొండ నియోజకవర్గానికి మళ్లీ మంత్రి పదవి దక్కింది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గుర్రం నారాయణప్ప 1985లో మంత్రి అయ్యాక.. అప్పటి నుంచి మరెవరికీ అవకాశం రాలేదు.  ఇన్నాళ్ల తర్వాత టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌కు కేబినెట్‌ స్థానం దక్కింది. దాంతో ఆ నియోజకవర్గ ప్రజలు సంతోషిస్తున్నారు. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేశవ్ మరో నాలుగుసార్లు గెలిచారు. 
ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఏడుసార్లు పోటీ చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ ఎన్నికల్లో కేశవ్ ఓడిపోయారు.  ఎమ్మెల్సీని చేసినా మంత్రి కాలేకపోయారు. నియోజక వర్గంలోని ప్రజల అభీష్టాలను నెరవేరుస్తూ ఈసారి కేశవ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: