టీడీపీ, జనసేన, బీజేపీలకు హనీమూన్ టైం ఇచ్చిన జగన్‌ ?

Veldandi Saikiran
టీడీపీ, జనసేన, బీజేపీలకు హనీమూన్ టైం నడుస్తోందంటూ ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపి ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. అయితే.. ఈ సమావేశంలో త్వరలోనే జరిగే శాసన, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగింది. అయితే... ఈ సందర్భంగా పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు జగన్.

అటు ఈ సమావేశంలో MLC లతో వైయస్ జగన్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. 40 శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారు...మర్చిపోవద్దని పేర్కొన్నారు.
మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తు ఉందని వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు ఏపీ మాజీ సీఎం జగన్‌. EVM ల వ్యవహారం పై దేశ వ్యాప్త చర్చ జరగాలని పేర్కొన్నారు ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

మనకు కష్టాలు కొత్త కాదని...గతంలో కూడా ఎన్నో కష్టాలు పడ్డామని తెలిపారు ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరఫున పోరాడదామని ఆదేశించారు. నాలుగైదు కేసులు పెట్టినంత మాత్రం భయపడవద్దని కోరారు. మళ్ళీ వైసిపి ఉవ్వెత్తున ఎగసి పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. శిశుపాలుని మాదిరిగా చంద్ర బాబు తప్పులు లెక్క పెట్టాలని... ఇప్పటికే ప్రజలకు అందాల్సిన స్కీమ్స్ డబ్బులు ఇవ్వలేదని వివరించారు.
ప్రస్తుతం టీడిపి , జనసేనా ,బిజెపి హనీమూన్ నడుస్తుందని... మరి కొంత సమయం కూటమికి ఇద్దామని తెలిపారు. ఆ తర్వాత ప్రజల తరుపున పోరాటాలు చేద్దామని... అసెంబ్లీ లో వైసిపి నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. కాబట్టి శాసన మండలిలో గట్టిగా పోరాటం చేద్దామన్నారు. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలే దక్కాయి. దీంతో పార్టీ డీలా పడిపోయింది. కానీ పార్టీ నేతల్లో జోష్‌ నింపేందుకు... రెండు రోజులకు ఒకసారి ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేలా కృషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: