టీడీపీ : వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి ?

Veldandi Saikiran
టీడీపీ సీనియర్‌ నాయకులు బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు బుద్ధా వెంకన్న. విజయసాయి రెడ్డి కామెంట్స్ పై బుద్ధ వెంకన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.... వైసీపీ పార్టీకి ప్రతిపక్షం కూడా లేదు పార్టీని రద్దు చేసుకోండి..విజయసాయి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడని ఆగ్రహించారు. వల్లభనేని వంశీ ని పిలిచి పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్‌ పెట్టాలంటూ విజయసాయిరెడ్డికి చురకలు అంటించారు బుద్ధా వెంకన్న.

విజయసాయి రెడ్డి ఒక శకుని.. అతని ఆటలు ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో సాగవని స్పష్టం చేశారు.  ముసలినక్క విజయసాయి రెడ్డి... ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందంటూ చురకలు అంటించారు. కారుకూతలు కూసిన ముసలి నక్కను మేం 2014 నుంచీ 2019 వరకూ వదిలేయడమే తప్పయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లి... పులి తోలు కప్పుకుని ప్రవర్తించినట్టు ప్రవర్తించారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహించారు టీడీపీ సీనియర్‌ నాయకులు బుద్ధా వెంకన్న.

ఎటువంటి పెద్ద సంఘటనలు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరగలేదని తెలిపారు.  మేం గెలిచాక.. టిడిపి నాయకుడినే కర్నూలులో చంపేసారని మండిపడ్డారు. వల్లభనేని వంశీ ఒక లుచ్చా.. ఆస్తులు కాజేస్తారని భయపడి పారిపోయి మీ మెప్పు కోసం అవాకులు చవాకులు మాట్లాడాడని ఆగ్రహించారు. వంశీ, కొడాలి నాని అనే పిల్లులు... లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వస్తే ఖండించలేదేందంటూ ఫైర్‌ అయ్యారు టీడీపీ సీనియర్‌ నాయకులు బుద్ధా వెంకన్న.

ఒక్క రోజుకే ఇలా అయితే ఎలా అయ్యా...‌. పిన్నెల్లి మా మీద మాచర్లలో దాడి చేయలేదా..?అంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలని సూచించారు. చంద్రబాబు, నారా లోకేష్ కను సైగ చేస్తే మీరు ఈ భూమి మీద ఉండగలరా..అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఉంటే పులుల్లాగా.. ప్రభుత్వం పోగానే పిల్లుల్లాగా మియావ్ అంటారా‌..అంటూ ఎద్దేవా చేశారు వల్లభనేని వంశీని ప్రజలు క్షమించే పరిస్ధితే లేదన్నారు టీడీపీ సీనియర్‌ నాయకులు బుద్ధా వెంకన్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: