కష్టాల్లో జగన్‌...చంద్రబాబుకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో... తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలు ఎక్కడ కనిపించినా దాడులు చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలు,  కార్యకర్తలపై కూడా  వైసిపి ఇదే వ్యవహారం  నడిపింది. చాలామంది నేతలను జైలు పాలు కూడా చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కూడా జైల్లో పెట్టించారు జగన్.

 
అయితే... వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు... తమ పార్టీ అధికారంలోకి రాగానే... ప్రతికారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా.. వైసిపి కి సంబంధించిన ఎలాంటి శిలాఫలకాలను అయినా బద్దలు కొడుతున్నారు. వైయస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్ విగ్రహానికి... తెలుగుదేశం కండువాలు కప్పుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.


 అయితే దీనిపై... హైకోర్టుకు వెళ్తామని వైసిపి పార్టీ స్పష్టం చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో వైసిపికి అండగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. వైయస్సార్ విగ్రహాలపై దాడి చేస్తున్న... తెలుగుదేశం పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ తరఫున.... ఈ దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో వైయస్సార్ విగ్రహం పై దాడులు జరగడం దారుణం అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో నిచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేయడం.. అత్యంత దారుణమని ఫైర్ అయ్యారు.


తెలుగుదేశం రౌడీలు... ఇలాంటి చర్యలకు పాల్పడితే అందరూ ఖండించాల్సిందేనని తెలిపారు. తెలుగు వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న రాజశేఖర్ రెడ్డి... ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదని తెలిపారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని... వైసిపి పై ఉన్న కోపంతో వైయస్సార్ విగ్రహాలు ధ్వంసం చేయడం ఏంటని నిలదీశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ని అనుమానించేలా ఇలా హీనమైన చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: