ఇది సవాలంటే... పద్మనాభరెడ్డిగా మారనున్న ముద్రగడ !

Veldandi Saikiran
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.... సంచలన నిర్ణయం తీసుకున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభo. ముందుగా చెప్పినట్టుగానే... పేరు మార్చుకుంటానని.... ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డి గా మార్చుకునేందుకు... గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు కూడా రెడీ చేసుకున్నట్లు తాజాగా ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తన పేరు మార్చుకునేందుకు అవసరమైన అన్ని.. పేపర్లను సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు.

పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. 72 వేల పై చిలుకు  మెజారిటీతో  వైసిపి అభ్యర్థి వంగ గీతాపై ఘనవిజయం సాధించారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బరిలో దిగిన సమయంలో... ఓ పెను సంచలన సవాల్ విసిరారు ముద్రగడ పద్మనాభం. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిస్తే... తన పేరు మార్చుకుంటాను అని శపథం చేశారు ముద్రగడ పద్మనాభం.

అయితే... మంగళవారం రిలీజ్ అయిన ఫలితాలలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. దీంతో ముందుగా చెప్పినట్లుగానే... తన సవాలు స్వీకరిస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ముందుగా చెప్పినట్లు తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని ఆయన వెల్లడించారు. సవాల్ లో తాను ఓడిపోయానని...అందుకే.. నా పేరు మార్చుకునేందుకు సిద్ధమయ్యాను అంటూ సంచలన ప్రకటన చేశారు ముద్రగడ పద్మనాభం.
 పవన్ కళ్యాణ్ కు గెలిచినందుకు గాను శుభాకాంక్షలు కూడా తెలిపారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి ఓటమిపై స్పందించారు ముద్రగడ. జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడ్డ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం... చాలా బాధ కలిగించిందన్నారు. ఇకపై తన ప్రయాణం జగన్మోహన్ రెడ్డి తోనే ఉంటుందని వివరించారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు... అద్భుతంగా ఉన్నాయని... కానీ ఏపీ ప్రజలు కూటమికి మొగ్గు చూపినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: