బ్యాగ్ సర్దుకోమన్నారు...లేడీ తడాఖా చూపించింది ?

Veldandi Saikiran
ఇండియా వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం.... దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి రాబోతుంది.  మూడోసారి మోడీ ప్రభుత్వం... ఇండియాలో రాబోతుందన్నమాట. 292 స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి... ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అటు ప్రతిపక్ష హోదాలో...ఇండియా కూటమి చాలా బలంగా ఏర్పాటు అయింది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి...233 స్థానాలు దక్కాయి.
ఇటు ఇతరులకు 18 స్థానాలు...దక్కినట్లు ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాలామంది సెలబ్రిటీలు... కొత్త ముఖాలు లోక్సభలో అడుగుపెట్టనున్నాయి. అందులో కంగనా రనౌత్ ఒకరు. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ఇటీవల బీజేపీ పార్టీలో చేరి... ఇప్పుడు ఎంపీగా అవతారం ఎత్తింది.
హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ . అయితే తొలిసారిగా పోటీ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ..విజయం సాధించింది. కంగనా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై... అఖండ విజయాన్ని సాధిస్తానని ముందే చెప్పింది. అందుకు తగ్గట్టుగానే.... తన సత్తా చాటింది హీరోయిన్ కంగనా రనౌత్.
ఆమెను ఎన్నికల ప్రచారం లో... బ్యాగ్ సదురుకొని... మండి వదిలి వెళ్లిపోవాలని...కాంగ్రెస్ అభ్యర్థి దారుణంగా ట్రోల్ చేశారు. కానీ ఆ కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్   పై   72,000  ఓట్ల తేడాతో విజయం సాధించింది కంగనా రనౌత్. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి...చివరి వరకు కంగనా రనౌత్... లీడ్ లోనే కనిపించారు. ఇక చివరిలో... 72,000 ఓట్ల మెజారిటీతో.... కాంగ్రెస్ అభ్యర్థి పై గ్రాండ్ విక్టరీ కొట్టారు కంగన. ఇన్ని రోజులు... హీరోయిన్గా కనిపించిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ... ఇక నుంచి ఎంపీగా కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: