డబ్బులు, పేరు కాదు అదే ముఖ్యం.. పవన్ దూరదృష్టికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

Pulgam Srinivas
పవన్ కళ్యాణ్ ఈ సారి జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో తెలుగు దేశం , బిజెపి లతో పాటు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు , రెండు పార్లమెంట్ స్థానాలను ఇచ్చారు. ఇక మొదట ఇవి చాలా తక్కువ అని కొంత మంది అన్నప్పటికీ పవన్ మాత్రం తక్కువ తీసుకున్న అందులో గెలవాలి అనే సంకల్పంతో పని చేశారు.

అందులో భాగంగా తాను తీసుకున్న 21 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలలో భారీ ఎత్తున ప్రచారాలను చేశాడు. ఇక పవన్ అందులో సూపర్ గా సక్సెస్ అయ్యాడు. ఈయన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 21 అసెంబ్లీ , రెండు పార్లమెంట్ స్థానాలలో ఈ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దీనితో జనసేన పార్టీ నుండి పోటీ చేసిన 100% మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇక తాజాగా ఇంతటి స్థాయి సక్సెస్ ను ఇచ్చిన జనాలు అందరికీ థాంక్స్ చెబుతూ పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటించారు. అందులో భాగంగా ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

ఇంత గొప్ప గెలుపును ఇచ్చినందుకు జనాలందరికీ ధన్యవాదాలు. నన్ను గెలిపించింది కేవలం పిఠాపురం ప్రజలు కాదు. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు. ఈ గెలుపు తో ఏ మాత్రం గర్వం రాదు. ఈ గెలుపు వై సి పి ని అనచడానికి అస్సలు కాదు. నేను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు. పేద ప్రజలకు న్యాయం చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ న్యాయం చేయడం కోసం పోరాడుతాను. మీ అందరికీ అండగా ఉంటాను. మీ ఇంట్లో ఒకరిలా ఉంటాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ తాజాగా మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: