ఎచ్చర్ల : గెలుపు దిశగా పరుగులు పెడుతున్న బీజేపీ అభ్యర్థి..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఉదయం 6 గంటల నుండే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. మొదట ప్రభుత్వ ఉద్యోగస్తులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇకపోతే మొదటి నుండి ఇటు కూటమి , అటు వై సి పి ఈ రెండు వర్గాలు కూడా ఎచ్చర్ల నియోజకవర్గం లో కచ్చితంగా గెలవాలి అని ఎన్నో ప్రణాళికలను రచించాయి.

ఈ ప్రాంతంలో వై సి పి పార్టీ అభ్యర్థిగా గొర్ల కిరణ్ కుమార్ పోటీ చేయగా ... ఈ ప్రాంత సీటును పొత్తులో భాగంగా బి జె పి పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎన్ ఈశ్వరరావు దక్కించుకున్నారు. ఇకపోతే ప్రస్తుత అధికార పార్టీ అభ్యర్థి కావడంతో గొర్ల కిరణ్ కుమార్ కు భారీ క్యాడర్ ఉండడం ఈయనకు బాగా కలిసి వచ్చే అంశంగా ఇక్కడి ప్రజలు మొదటి నుండి చెప్పుకొస్తున్నారు.

ఇక తెలుగుదేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఉండడంతో ఈయనకు బిజెపి అనుకూల ఓట్లతో పాటు తెలుగు దేశం , జనసేన అనుకూల ఓట్లు కూడా పడే అవకాశం ఉండడంతో వీరిద్దరి మధ్య గట్టి పోటీనే నెలకొనే అవకాశం ఉంది అని జనాలు భావిస్తూ వచ్చారు. కాకపోతే ఇక్కడ మొదటి నుండి బి జె పి అభ్యర్థి ఈశ్వర రావు ఫుల్ జోష్ చూపిస్తున్నారు. దానితో 14 రౌండ్లు పూర్తి అయ్యేసరికి బిజెపి అభ్యర్థి అయినటువంటి ఈశ్వర రావు కి 70773 ఓట్లు రాగా , వైసిపి అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ కి 53046 ఓట్లు వచ్చాయి. దీనితో ఈశ్వర రావు17727 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: