కొత్త సినిమా స్టార్ట్ : అసెంబ్లీలోకి పవన్ ఎంట్రీ... ఆ నాయకులకు చుక్కలు కనబడనున్నాయా..?

Pulgam Srinivas
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ "జనసేన" అనే పార్టీని స్థాపించాడు. కానీ ఆ దఫా ఎన్నికలలో జనసేన పార్టీ పోటీలో లేదు. ఇక పోయిన సారి అనగా 2019 వ సంవత్సరం అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో జనసేన అభ్యర్థులు రాష్ట్రమంతా అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలలో పోటీ చేశారు. కానీ ఈ పార్టీ రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఈ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తే రెండింటిలో కూడా ఓడిపోయాడు. ఈ పార్టీ నుండి కేవలం ఒకే వ్యక్తి గెలుపొందారు. ఇకపోతే 2024 వ సంవత్సరం వ్యూహాత్మకంగా అడుగులు వేసి టీడీపీ , బీజేపీ లతో జతకట్టి పోటీలోకి దిగారు. అందులో భాగంగా జనసెనా చాలా తక్కువ సీట్లనే తీసుకుంది. అలాగే పవన్ కూడా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీలోకి దిగారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ విడుదల అయ్యాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం దాదాపు అందరూ పవన్ కళ్యాణ్ "పిఠాపురం" నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపొందనున్నట్లు ప్రకటించారు.

అలాగే ఆ ప్రాంత వాసులు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు ఈ సారి కన్ఫామ్ అని చెబుతూ వస్తున్నారు. ఇక పవన్ బయట జగన్ ను ఏ స్థాయిలో ఆడుకుంటాడో మన అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి అసెంబ్లీ లోకి అడుగుపెడితే జగన్ కి చుక్కలు కనిపించడం ఖాయం అని , అలాగే జగన్ తో పాటు మరికొంతమంది వైసిపి నేతలను కూడా పవన్ ఆడుకుంటాడు అని జనసేన నేతలు , కార్యకర్తలు , అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి పవన్ అసెంబ్లీలో తన మాటల దాడితో ప్రత్యర్థులకు ఏ విధంగా చుక్కలు చూపిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: