ఆ విషయంలో జగన్ కు షాక్ ఇచ్చిన ఆరా మస్తాన్ సర్వే.!

FARMANULLA SHAIK
ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి.ఈ పోల్స్‌లో ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి వైసీపీ, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది సర్వేల ఆధారంగా ఈ పోల్స్‌ను విడుదల చేశాయి.ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఓ వైపు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మరో వైపు హోరాహోరీగా పోరాడారు.ఆ నాలుగు నియోజకవర్గాల్లో సీఎం జగన్ కు బిగ్ షాక్ తగలనుందని ఆరా మస్తాన్ సర్వే స్పష్టం చేసింది. టీడీపీ నేతలు పోటీ చేసిన కుప్పం, మంగళగిరి, పిఠాపురం, హిందూపురంలో భారీగా మెజార్టీలతో అభ్యర్థులు గెలవబోతున్నారని వెల్లడించింది.చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బాలయ్యను ఓడించేందుకు సీఎం జగన్ అస్త్రశస్త్రాలు రచించారు. చంద్రబాబు కుప్పంలో తప్ప మిగిలిన మూడు చోట్ల మహిళలను రంగంలోకి దించారు. పవన్, లోకేశ్, బాలయ్య ఓడిపోతే మహిళల చేతుల్లో ఓడిపోయారనే విమర్శలు చేయొచ్చని జగన్ బిగ్ స్కెచ్ వేశారు.అయితే ఈ స్కెచ్ పటా పంచలు అయినట్లు ఆరా మస్తాన్ విడుదల ఎగ్జిట్ పోల్‌లో అర్ధమవుతోంది.చంద్రబాబు గెలిస్తే భరత్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పుకోచ్చారు. అయితే ఈ హామీకి కూడా ఎదురు దెబ్బ తగలనుందని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. ఆరా మస్తాన్ సంస్థ నిర్వహకుడు ఎగ్జిట్ పోల్స్‌పై మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ భారీ మెజార్టీలతో గెలవబోతున్నారని చెప్పారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఇక లోక్ సభ పరిధిలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో టీడీపీ కూటమికే అన్ని సంస్థలు పట్టం కట్టాయి. అసెంబ్లీ పరిధిలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీ, టీడీపీకి సమాన ఫలితాలు విడుదల అయ్యాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది. రిజల్ట్స్ రిలీజ్ అయితే గాని అసెంబ్లీ పరిధిలో ఏ పార్టీకి ప్రజలు పట్టంకట్టారనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: