జర్నలిస్ట్ సాయి:ఎగ్జిట్ పోల్స్ ని నమ్మవచ్చా..??

FARMANULLA SHAIK
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శనివారంతో ముగియనున్న నేపథ్యంలో అదేరోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్పోల్స్ విడుదలకు ఈసీ అంగీకరించింది. వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో తిరిగి సేకరించిన వివరాలను విడుదల చేయనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. రాజకీయ పార్టీలు గెలుపు మాదంటే మాదని పదేపదే ఊదరగొట్టగా...ఇప్పుడు వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎగ్జిట్పోల్స్ అంచనాలకు దగ్గరిగానే ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో సగం గెలుపు నేడు ఖరారైనట్లే.అయితే ఈ ఎగ్జిట్పోల్స్ అంచనాలు నూటికి నూరుశాతం నిజమైన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. ఇంకా చెప్పాలంటూ గతంలో దారుణంగా ఈ అంచనాలు తప్పినా....ప్రజల్లో మాత్రం వీటిపై క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.ఎగ్జిట్ పోల్స్ ఇవాళ సాయంత్రం ఆరున్నర గంటలకు వస్తాయి వాటిని నమ్మొచ్చా? అంటే మూఢ్ తెలుసుకోవడానికి తప్పించి ఖచ్చితమేం కాదు.చత్తీస్గడ్  విషయంలో మొన్న అన్ని చానళ్లు ఫెయిల్ అయ్యాయి.దేశంలో ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా చత్తీస్గడ్ లో భారతీయ జనతా గెలుస్తుంది అని చెప్పలేదు. అదే సందర్భంలో 2018లో కూడా మన తెలంగాణలో కూడా ఫెయిల్ అయింది. కానీ జాతీయస్థాయిలో మూడు కరెక్ట్ గానే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వివిధ సంబంధాల్లో సక్సెస్, వేల్యూర్స్ ఒకసారి చూద్దాం.
2014 ఎన్నికల్లో మేము ఒక్కళ్ళం మాత్రమే తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పాము.మిగతా వాళ్ళు ఆరోజు చూస్తే ఎన్డీటీవీ తెలుగుదేశం పార్టీ 75 నుంచి 95 స్థానాలు సాధిస్తే వైసీపీ 50 నుంచి 100 వస్తుంది అని చెప్పి అంచనా వేసింది. అప్పుడు రెండే రెండు ఛానల్స్ వాళ్ళు సర్వే చేశారు. కానీ అది ఫెయిల్ అయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వైసిపి రాలేదు. అలాగే ఎన్ టీవీ వేసిన సర్వే కూడా అప్పుడు ఫెయిల్ అయింది. ఒక్క జెమిని టీవీ మాత్రమే టిడిపి 129 నుంచి 135 స్థానాలతో అధికారంలో వస్తుందని తేల్చి చెప్పింది.అలాగే 2019లో చూసుకుంటే సిపిఎస్ అట్లాగే విడిపి అసోసియేట్, ఆరా, ఇండియా టుడే నలుగురు కూడా సక్సెస్ అయ్యారు లేకపోతే ఎగ్జాట్ ఫిగర్ కాదు, కానీ గెలిచేది వైసిపి అని  చెప్పారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వస్తుందని ఐ ఎన్ ఎస్ ఎస్ అంచనా వేసింది. అది కాస్త ఫెయిల్ అయింది. మిగతా నాలుగు కూడా సక్సెస్ అయ్యాయి. అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్లమెంటు స్థానాలు చూస్తే ఇండియా టుడే, న్యూస్ 19, రిపబ్లిక్, సి ఓటర్, టైమ్స్ నౌ, టుడేస్ చాణిక్య, అందరిలో కూడా సక్సెస్ అయింది ఇండియా టుడే ఒకటి మాత్రమే.కచ్చితంగా దేశం మొత్తం మీద ఇవే వస్తుంది అని చెప్పలేము. దగ్గర దగ్గరగా సర్వేలన్నీ ఒకే మాదిరిగానే ఉండి ఉండవచ్చు. కానీ ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ లో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: