పోస్టల్ బ్యాలెట్ : ఏపీకి ఓ రూల్ దేశానికి ఒక రూల్ న్యాయమా ఇది..??

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాన పార్టీ నేతలు తామ పార్టీ గెలుస్తుంది అంటే తమ పార్టీ గెలుస్తుంది అని భారీ ధీమాతో ఉన్నాయి అయితే ఏ పార్టీ విజయం సాధిస్తుంది ప్రభుత్వాన్ని ఏర్పరచు కుంటుంది అలాగే ఏ పార్టీ ప్రతిపక్షం హోదాలో ఉంటుంది అనేది మరో మూడు రోజుల్లో తేలనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో దీనిపై చర్చ జరుగుతుంది.కౌంటింగ్ కి నాలుగు రోజుల ముందుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు రూల్స్ రూల్స్ ను నిబంధనలను మార్చుకుంటూ ఇచ్చినటువంటి మెమో మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన హౌస్ పిటిషన్ ని హైకోర్టు విచారించినప్పుడే విన్నాం. ఆ వైసీపీ తరఫున వాదనలను వినిపించినటువంటి హైకోర్టు సుప్రీం న్యాయవాది అభిషేక మనోసంగ్వి  తెచ్చినటువంటి మెమోను అందులో పొందుపరిచినటువంటి నిబంధనలు ఆంధ్రప్రదేశ్ కి ,భారతదేశానికి, వేరువేరు రూల్స్ అప్లై చేసినటువంటి ఆ సర్క్యులర్ నీ చూసి కోర్టులో నోరువెళ్ళ పెట్టారు. అంత సీనియర్ న్యాయవాది హావభావాలు ఆయన ప్రవేశపెట్టిన పదాలు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తుందో మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ సీనియర్ న్యాయవాది ఆశ్చర్యపోయి నేనెక్కడ చూడలేదు ,ఎలక్షన్ కమిషన్ అనే ఒక నేషనల్ కాన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో  ఒక రూల్, దేశం మొత్తం మీద మరొక రూల్ అప్లై చేస్తుందా? అది కౌంటింగ్ కి నాలుగు రోజుల ముందు ఇటువంటి రూల్స్ మార్చవచ్చా? నిబంధనలను మార్చవచ్చా? ఒకవేళ చట్టపరంగా ఉన్న నిబంధనలను మార్చాలి అంటే ఒక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ పని చేస్తారా? పార్లమెంటుతో పని లేకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మెమోస్ ఇచ్చేసి ,సర్కులర్ ఇచ్చేసి ,నోట్స్ ఇచ్చేసి, ఇష్టపూర్వకంగా మార్చుకుంటారా.? అది కౌంటింగ్ నాలుగు రోజుల ముందు మ్యాచ్ ప్రారంభమై ఒకవైపు ముగిసిన తరువాత రూల్స్ మారుస్తారా? అసలు ఇటువంటివి మనము ఒప్పుకోవాలా.? నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిపిస్తామన్న ఎలక్షన్ కమిషన్, ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకమైనది అని చెప్పే ఎలక్షన్ కమిషన్ 5 లక్షల నలభై వేల ఓట్ల తోటి గిమ్ముక్కులు చేద్దామని చెప్పి ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తారా. 5 లక్షల నలభై వేల ఓట్లు అనేది మొత్తం ఫలితాలనే తారుమారు చేసేటువంటి సంఖ్య అది.

 ఆ సంఖ్యతో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లేని రూల్స్ పోస్టల్ బ్యాలెట్లు వేసినప్పుడు లేని రూల్స్ పోస్టల్ బ్యాలెట్ వేసి అయిపోయి నాలుగు రోజులలో ఫలితాలు వచ్చేముందు రూల్స్ మారుస్తారా. రూల్స్ మార్చేసి విజేతలు ఎవరు నిర్ణయిస్తారా? నేనెక్కడ చూడలేదు ఇంత దారుణం అని చెప్పి అంతా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఇటువంటివి మనం ఎలో చేయకూడదు, వీటన్నింటిని కొట్టి పారేయండి. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే ఉండాలి. ఇప్పుడు రూల్స్ మార్చడం ఏంటి .?మరి ఫైనల్ గా హైకోర్టు అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక రూల్ దేశానికి ఒక రూల్ కానివ్వండి కౌంటింగ్ కి నాలుగు రోజుల ముందు మ్యాచ్ ముగిసిపోయిన తరువాత ఫలితాలు ఇచ్చేముందు ఒకరికి అనుకూలంగా రూల్స్ మార్చే దాన్ని ఎలో చేస్తుందా?హైకోర్టు ఇటువంటివి కొట్టేసి పక్కన పెడుతుందా ?లేకపోతే కౌంటింగ్ కు రెండు ,మూడు రోజులు ఉంది అని వాళ్ళ విచక్షణ అధికారంలో మనం జోక్యం చేసుకోలేము అంటుందా చూడాలి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు తీర్పు మరి ఈ రెండు రోజుల్లో కౌంటింగ్ ఉంది .నిజంగానే ప్రజాస్వామ్యవాదులు వ్యవస్థాపనను ప్రేమించే వాళ్ళు దీనీ లోతుపాతులు ఏ విధంగా ఉంటాయి. ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, అన్నటువంటి కనీస బేసిక్ తెలిసినటువంటి వాళ్ళకి తలనొప్పిగా మారిపోయింది. మరి ఈ విషయంపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: