రేస్ సర్వే : ఏపీలో ఆ పార్టీదే గెలుపు...ఆపడం ఎవరి తరం కాదు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఏపీలోనే కాకుండా... ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ఉత్కంఠతో చూస్తున్నారు. ఇక జూన్ ఒకటో తేదీన అంటే నేడు ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ రాకముందు కొన్ని సర్వే సంస్థలు తమ అంచనాలను స్పష్టం చేస్తున్నాయి.
 

ఇప్పటికే కొన్ని సర్వ సంస్థలు రిలీజ్ చేసిన ఫలితాలు... కొన్ని తెలుగుదేశంకు అనుకూలంగా వస్తే.. మరికొన్ని వైసిపి పార్టీకి అనుకూలంగా  ఉన్నాయి. అనుకూలంగా ఉన్న వాటిని... ఆయా పార్టీలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రేస్  అనే సంస్థ...  తమ అంచనాలను వెల్లడించింది. ఈ సర్వే సంస్థ లెక్కల ప్రకారం వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం గ్యారెంటీ అని తెలుస్తుంది.

 
అయితే సీట్ల వివరాలు ఈ సంస్థ చెప్పలేదు కానీ... పర్సంటేజ్ ల లెక్కలు వివరించింది. రేస్ సంచలన సర్వే ప్రకారం... వైసిపి పార్టీకి 49. 8  శాతం ఓటింగ్  వస్తుందట. అంటే దాదాపు వైసీపీ పార్టీకి 50% ఓటింగ్ వస్తుందన్నమాట. ఇక అటు తెలుగుదేశం కూటమికి... 45% ఓటింగ్ పర్సంటేజ్ వస్తుందట. ఇతర పార్టీలకు మూడు శాతం ఓటింగ్ వస్తుందని సర్వే సంస్థ వెల్లడించింది.

 
ఇక సైలెంట్ ఓటింగ్...  అంటే ఏ పార్టీకి ఓటు వేశామనేది చెప్పని  ఓటర్ల శాతం 2.8% ఉందట. ఈ ఓట్లన్నీ కూటమికి... పడినప్పటికీ... ఓవరాల్ గా తెలుగుదేశం కూటమికి 48 శాతం వరకు ఓటింగ్ వస్తుంది. ఈ లెక్కన వైసిపి పార్టీ కచ్చితంగా ఏపీలో అధికారంలోకి వస్తుందన్నమాట. అందరూ చెబుతున్నట్టు 95 స్థానాలకు పైగా... వైసిపి పార్టీ  ఎమ్మెల్యేలను గెలిచే ఛాన్స్ ఉంటుంది. 49 శాతం పర్సంటేజ్ చూసుకున్నా కూడా... సెంచరీ వరకు వైసిపి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా... జగన్మోహన్ రెడ్డి మరోసారి.. ముఖ్యమంత్రి అయి...అనే నేను అననున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: