కంగనాకు ఆరోజు కన్యాదానం... కాంగ్రెస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటీ మణులలో కంగనా రనౌత్ ఒకరు. ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం ఈమె ప్రభాస్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏక్ నిరంజన్ అనే మూవీ లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇలా సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఈమె కొంత కాలం క్రితమే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈమె కొంత కాలం క్రితమే భారతీయ జనతా పార్టీ లోకి చేరింది. అందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంటు నియోజక వర్గం నుండి బి జె పి అభ్యర్థి గా బరిలోకి దిగింది. ఇక ఈ ప్రాంతంలో ఈమె చాలా రోజులు ప్రచారాలను కూడా నిర్వహించింది. ఇకపోతే కంగనా పోటీ చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంటు నియోజకవర్గం లో రేపు ఎలక్షన్ జరగనుంది. ఇందుకు సంబంధించిన రిజల్ట్ జూన్ 4 వ తేదీన విడుదల కానుంది. ఇలాంటి సమయం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి విక్రమాదిత్య సింగ్ , కంగనా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ ... జూన్ 4 వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ రోజున కంగనా కు కన్యదానం చేసి హిమాచల్ నుండి పంపిస్తాము అని ఆయన అన్నారు. ఇకపోతే ఆమె ఒక కాలు ముంబై లో ఉంటే , మరో కారు హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. అలాంటి వ్యక్తి హిమాచల్ వాసుల కష్టాలను తెలుసుకొని వారికి ఎలా అండదండగా ఉంటుంది. వారికి ఎలా సహాయం చేయగలదు , వారి ఉన్నత స్థితి కోసం ఆమె ఎలా సహాయ పడగలదు అని ఆయన ప్రశ్నించాడు. ఇకపోతే కంగనా గురించి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి విక్రమాదిత్య సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: