టీడీపీ: కేంద్రం నుంచి లీకులు.. ఢీలా పడిపోయిన క్యాడర్..?

Divya
దేశంలో ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకుంటున్నాయి. జూన్ 1వ తేదీన ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో కేవలం ఎన్నికల కోడ్ నిబంధనలకు అడ్డంగా ఉండడంతో  సర్వే సంస్థలు అన్నీ కూడా తమ నివేదికను తెలియజేయడానికి వెనుకడుగు వేస్తున్నారు.. దేశంలో ఆఖరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ని బహిరంగంగా ప్రకటించేందుకు చాలా సర్వే సంస్థలు కూడా ఆత్రుతంగా ఉన్నాయి.. అయితే ఇందుకు ఎన్నికల కమిషనర్ కూడా అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పైన రాజకీయ పార్టీలో చాలా ముతకంఠత నెలకొంది.

ఇతర ప్రాంతాలలో రాజకీయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ప్రకటించాయి. ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగడంతో ఎవరికి మేలు చేస్తుందో అని రాజకీయ పార్టీలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ పైన రాజకీయ పార్టీలన్నీ కూడా ఆశలు పెట్టుకున్నాయి. ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి ఎగ్జిట్ పోల్స్ పైన పెద్దగా ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది.

కేంద్రం నుంచి వచ్చిన నివేదికలలో కూడా కూటమి పైన పెద్ద సానుకూలత రిపోర్టింగ్ రాకపోవడంతో టీడీపీ నాయకులు సైతం చాలా డీలపడుతున్నట్లుగా సమాచారం.ఇవన్నీ చూస్తూ ఉంటే టిడిపి ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా వ్యతిరేకంగానే వస్తున్నాయని వార్తలు కేంద్రం నుంచి లీకులుగా వినిపిస్తున్నాయి.. ఈ విషయం టిడిపిలో ఎక్కువగా వినిపించడంతో క్యాడర్ కూడా డీలపడిపోయినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు టిడిపి కూటమిలోకి వస్తుందని భారీ బెట్టింగులు కాసిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఒక్కసారిగా అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ పరిణామాలను చూస్తూ ఉంటే ఎగ్జిట్ పోల్స్ పైన టిడిపి పెద్దగా ఆశలు పెట్టుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో జూన్ 4వ తేదీ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: