వైసీపీ విక్టరీ : ఐదోసారి కూడా కొడాలి నాని విజయం కన్ఫామ్ అయినట్లేనా..?

Pulgam Srinivas
దాదాపు రెండు మూడు నెలల హడావిడి తర్వాత మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. జూన్ 4 వ తేదీన రిజల్ట్ రాబోతుంది. మొదటి నుండి కూడా ఆంధ్ర రాష్ట్రం లో రెండు ప్రధాన పార్టీలు అయినటువంటి వై సీ పీ , కూటమి కృష్ణా జిల్లాలోని గుడివాడ సీటుపై ఎంతో దృష్టి సారించారు. ఎందుకు అంటే ఇక్కడ వై సి పి పార్టీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి కొడాలి నాని పోటీ చేస్తూ ఉంటే , ఈ స్థానంలో ఎలాగైనా తమ అభ్యర్థి గెలవాలి అని కూటమి ప్రయత్నాలను చేసింది.

ఇక ఈ ప్రాంతం నుండి కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము భరిలోకి దిగారు. ఇప్పటికే గుడివాడ నుండి కొడాలి నాని వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకు ఈ ప్రాంతంలో అద్భుతమైన పట్టు ఉంది. ఇక ఐదవ సారి కూడా ఈయన ఇదే ప్రాంతం నుండి సీటు దక్కించుకొని పోటీలోకి దిగారు. ఇక వెనిగండ్ల రాము మొదటి సారి పోటీలోకి దిగడం ఈ సారి కాస్త కూటమి గాలి బలంగా వేస్తూ ఉండడం అలాగే టి డి పి తో పాటు జనసేన , బీజేపీ ఓట్లు కూడా వెనుగండ్ల రాముకు పడే అవకాశం ఉన్నందున ఈయన గెలుస్తాడేమో అని చాలా మంది మొదటి నుండి భావించారు.

కాకపోతే ఎలక్షన్ ల టైం వరకు సీన్ మొత్తం మారిపోయినట్లు తెలుస్తోంది. నాలుగు సార్లు గెలిచిన లోకల్ గా కొడాలి నాని కి పెద్దగా నెగిటివ్ లేకపోవడం , అలాగే వై సి పి పార్టీలో అత్యంత కీలక సభ్యుడిగా కొనసాగుతూ ఉండడం , ఈయనకు కేడర్ బలంగా ఉండడంతో కొడాలి నాని సైడ్ భారీగా ఓట్లు పడ్డట్టు దానితో 5 వ సారి కూడా ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 5 వ సారి కూడా కొడాలి నాని ఈ ప్రాంతం నుండి గెలిచినట్లు అయితే గుడివాడలో ఈయనకు తిరుగులేకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kn

సంబంధిత వార్తలు: