పల్నాడు : ఎంపీ పై రాళ్ల దాడి టీడీపీ డ్రామానేనా..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం ప్రారంభమై చివరి దశకు చేరుకోనుంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినా లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్ల దాడి జరిగింది.అక్కడున్న వైసీపీ నేతలకి ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది.దానికి అక్కడున్నా కొంతమంది టీడీపీ నేతలే లావు కాన్వాయ్ పై రాళ్లదాడి చేసి దాన్ని వైసీపీ నేతలే చేయించినట్లుగా సోషల్ మీడియాలో క్రియేట్ చెస్తున్నారు.ఆ సంఘటన పై శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గం లో వైసీపీ హింసాత్మక దాడులు చేపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ అభ్యర్థులను పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకోవడం ప్రజాస్వామ్యనికే విరుద్ధం అన్నారు. దొండపాడు పోలింగ్ కేంద్రం సమస్యాత్మకంగా ఉందని కేంద్రానికి ముందే చెప్పామని అన్నారు. దానిపై ఈసీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని అన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు టీడీపీ అభ్యర్థులకు సహకరించడం లేదు. వైసీపీ నేతల ఆగడాలకు పోలీసులు పూర్తి మద్దతు ఇస్తున్నారని అన్నారు.ఓటమి భయంతోనే తన కారుపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అవసరమైతే రేపోలింగ్ చేయమని కేంద్రానికి రిక్వెస్ట్ చేసుకుంటామని అన్నారు.కానీ ఈ రాళ్ల దాడి అనేది టీడీపీ కూటమి లో ఒక భాగమేనని వైసీపీ నేతలను మరియు పార్టీని ప్రజల్లో మరియు సోషల్ మీడియాలో నెగటివ్గా ప్రచారం చేయడానికి ఇలాంటి దాడి టీడీపీ నేతలే చేయించి దాన్ని వైసీపీ పై రుద్దుతున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు.ఈ సంఘటన పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ రాళ్ల దాడి చేసిన అభ్యర్థులని గుర్తించి తగిన విచారణ చేయమని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: