విశాఖ‌లో ఈ సారి సీన్ రివ‌ర్స్‌... ఫ్యాన్ ప్ర‌భంజ‌నం ముందు సై ' కిల్ ' అయ్యిందిగా..?

Pulgam Srinivas
చాలా సంవత్సరాల క్రితం విశాఖపట్టణం ఏరియా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. టీడీపీ పార్టీకి ఈ ప్రాంతం నుండి భారీ మొత్తంలో సీట్లు వచ్చేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సీన్ పూర్తిగా మారింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 2014 వ సంవత్సరం మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీకి ఈ ప్రాంత ప్రజల నుండి మంచి ఆదరణ దక్కింది. ఇక ఆ ఎలక్షన్ లలో తెలుగుదేశం పార్టీ కి భారీ మెజారిటీ రావడంతో ఈ పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో ఏపీలో విశాఖపట్నం పెద్ద పట్టణం కావడంతో దీనినే రాజధాని చేస్తారు అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కృష్ణ , గుంటూరు మధ్య రాజధాని ఉంటే బాగుంటుంది అని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ టైమ్ లో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాడు. అలాగే అక్కడ ఎన్నో భవనాలను నిర్మించే దానిని ఆధునికరించాడు. ఇక ఈ విషయంతోనే విశాఖ ప్రజలు చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు.

ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం ఎన్నికలు రానే వచ్చాయి. ఇక అందులో మాత్రం విశాఖ ప్రజలు తమ ప్రతాపాన్ని చూపించారు. తెలుగు దేశం పార్టీ కి విశాఖ నుండి ఎక్కువ సీట్లు రాలేదు. ఎక్కువ వైసీపీ పార్టీకి ఈ ప్రాంతం నుండి భారీ మొత్తంలో సీట్లు వచ్చాయి. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా అమరావతి మాత్రమే రాజధాని కాకుండా మూడు రాజధానుల ప్రస్తావనను తెరపైకి తెచ్చారు. దానితో విశాఖ ప్రజలు ఆనందపడ్డారు. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ ప్రాంతంలో కూటమి ఎక్కువ సీట్లు వస్తుంది అని ఆశించలేదు.

అందుకు తగినట్టుగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుండే పోలింగ్ స్టార్ట్ అయింది. విశాఖలో భారీగానే పోలింగ్ జరుగుతుంది. కాకపోతే ఇప్పటివరకు పడిన ఓట్లలో ఎక్కువ శాతం వైసీపీ పార్టీకే పడినట్లు కూటమి సైడు చాలా తక్కువ ఓట్లు పడినట్లు అవుతున్నట్లు తెలుస్తుంది. ఇలానే జరిగితే దాదాపుగా ఈ ప్రాంతంలో భారీ సీట్లను వైసీపీ కైవసం చేసుకునే విశాఖలో మరోసారి జోరు చూపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: