ఏపీ: పవన్ కళ్యాణ్ ఇజ్జత్కే సవాల్.. ఓడిపోతే తల ఎక్కడ పెట్టుకుంటాడో..?
పిఠాపురంలో 2.29 లక్షల మంది ఓటర్లు ఉంటే.. వారిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఏకంగా 75 వేల మంది దాకా ఉన్నారు. ఎస్సీలు 28, మాలలు 20 వేలు, మాదిగలు 8 వేలు, శెట్టి బలిజ 23 వేల మంది, 17 వేల మత్స్యకారులు, రెడ్లు 10 వేల మంది, కొప్పుల వెలమ 9 వేలు, తూర్పు కాపు 7 వేలు, క్షత్రియులు 6 వేల మంది ఉన్నారు. ఈ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుంటే కాపులే ఈ నియోజకవర్గంలో గెలుపును శాసిస్తారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి వీరిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అయితే వైసీపీ కూడా వ్యూహాత్మకంగా కాపు కులానికి చెందిన వంగా గీతను బరిలోకి దింపింది.
కాకినాడ ఎంపీ వంగా గీతకు రాజకీయాల్లో చాలా అనుభవం ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈమె విజయకేతనం ఎగురవేశారు. 2019లో వైసీపీ నుంచి కాకినాడలో ఎంపీగా విజయం సాధించారు. జగన్ వంగా గీత గురించి మంచి చెబుతూ ఆమెకు ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ కోసం రామ్ చరణ్, జబర్దస్త్ నటులు ప్రచారాలు చేశారు. అయితే ఈ ఇద్దరి అభ్యర్థులలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఓడిపోతే పవన్ తల ఎత్తుకోలేడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.