రాయి దెబ్బ: టీడీపీ నేతపై మళ్ళిన కేసు?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిపై విజయవాడ శివారులోని సింగ్‌నగర్లో జరిగిన రాయి దాడి ఘటన సంచలనాల దిశగా పోతుంది. ఈ రాయి దాడి కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు.వీరంతా కూడా 17 ఏళ్లలోపు వయసు వారేనని తెలుస్తోంది. వీరిలో సురేష్ అనే యువకుడు.. ఈ రాయిని నేరుగా  జగన్‌కు తగిలేలా విసిరారని పోలీసు వర్గాల నుంచి తెలుస్తుంది. అయితే.. ఈ కేసు ఇంకా విచారణ దశలోన ఉన్న నేపథ్యంలో దీనిపై పూర్తి క్లారిటీ రావడం లేదు. కానీ.. ఇంతలోనే ఈ కేసు టీడీపీ నేత వైపు మళ్లిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.జగన్‌ మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. ఇక్కడ నుంచి తెలుగుదేశం తరఫున బొండా ఉమా మహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అయితే.. ఈయన ప్రోద్బలంతోనే యువకులు బాగా రెచ్చిపోయి దాడి చేశారనేది పోలీసుల నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఒక్కసారిగా రాజకీయం అనేది భగ్గుమంది. తెలుగుదేశం నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.


బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడిని అరెస్టు చేసి.. అతన్ని చిత్రహింసలకు గురి చేసి.. తద్వారా.. ఈ కేసును తెలుగుదేశం పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.ఇక పార్టీ ఏపీ చీఫ్ అయిన అచ్చెన్నాయుడు నుంచి.. ఇతర నాయకుల దాకా కూడా.. రాయి దాడి ఘటనలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బొండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. ఇంకా అంతేకాదు.. ఇప్పటికే కొంతమంది నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు కూడా చేసేశారు. ఇది అనుచితమని.. బొండా ఉమాను ఇరికిస్తున్నారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. భద్రతని కల్పించడంలో విఫలమైన అధికారులను తక్షణం బదిలీ చేయాలని వారు కోరుతున్నారు. మరి దీనిపై పోలీసులు ఇంకా ఎన్నికల అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా ఈ రాయి దెబ్బ కేసు రోజుకో మలుపు తిరుగుతుందనే చెప్పాలి. మరి చూడాలి ఈ కేసు ఎప్పుడు క్లోజ్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: