రేవంత్ ఓవైసీని గెలిపించమన్నాడు.. సంచలన నిజం చెప్పిన ఫిరోజ్ ఖాన్?

praveen
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఎంతలా వేడెక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెలంగాణలో పట్టు సాధించేందుకు పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుంది బిజెపి. అయితే గత అసెంబ్లీ  ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అయిన సత్తా చాటాలని భావిస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్.. ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోను సత్తా చాటాలని అనుకుంటుంది.

 ఇలా ఎవరికి వారు విజయం మాదే అంటూ ముందుకు సాగుతున్నారు అని చెప్పాలీ. అయితే తెలంగాణలోని మిగతా పార్లమెంట్ స్థానాలలో రాజకీయం ఒకలా ఉంటే.. హైదరాబాద్లో మాత్రం మరింత వాడి వేడిగా సాగుతోంది. మజిలీస్ పార్టీ కంచుకోటగా పిలుచుకునే హైదరాబాద్ లో విజయం సాధించి ఓవైసీకి షాక్ ఇవ్వాలని అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అటు బిఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తుండగా.. బిజెపి నుంచి హిందుత్వ వాది అయిన మాధవి లత పోటీ చేస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే సీఎం రేవంత్ ఇలా ఎందుకు చేస్తున్నారూ అనే విషయంపై అందరూ కన్ఫ్యూషన్ లో పడ్డారు.

 కాగా కాంగ్రెస్ హైదరాబాద్ ఏపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం వెనక సంచలన నిజం దాగి ఉంది అన్న విషయాన్ని ఆ పార్టీ నేత ఫెరోజ్ ఖాన్ ఇటీవల చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఎంపీగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది అంటూ ఫెరోజ్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది అంటూ సంచలన నిజాన్ని బయటపెట్టాడు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే డిసైడ్ చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ ఏది చెప్తే మేము అదే ఫాలో అవుతాం. వ్యక్తిగతంగా మాత్రం తాను అసదుద్దీన్ ఓవైసీ తో కొట్లాడుతూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు ఫెరోజ్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: