వాలంటీర్ వ్యవస్థ గొప్పదనం బాబోరే చాటి చెప్పారుగా?
నేడు వృద్ధులు ఎండల్లో నిల్చొని గంటల తరబడి క్యూలైన్లో వేచి చూసి పింఛన్లు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటి వద్దకే పింఛన్ అందజేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో 1.26 లక్షల మంది సచివాలయ శాశ్వత ఉద్యోగులు ఉన్నారని.. వారితో ఇంటి వద్దే పంపిణీ చేయాలని సూచించింది. అయితే ఈ విషయంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చేయాల్సింది అంతా చేసి.. ఇప్పుడు బుడి బుడి దుఃఖం తీస్తున్నారని విమర్శలు గుప్పించారు. వృద్ధురాలిపై అంత ప్రేమ ఉంటే.. ఆ పని ఎందుకు చేశారంటూ నిలదీస్తున్నారు. గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసినా అవి ఆశించిన ఫలితం రాలేదు. జన్మభూమి కమిటీల వల్ల ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన చంద్రబాబు వీటిని రద్దు చేశారు. ఈ సమయంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
అదే ఇప్పుడు జగన్ ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థను మూడు నెలలు ఆపు చేయిస్తే మాత్రం దీని ప్రభావం ఎన్నికలపై పడింది. దీంతో మేం అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తాం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు వల్లే వాలంటీర్ వ్యవస్థ విలువ తెలిసిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆయనకు కృతజ్ఙతలు చెబుతూ పోస్టులు కూడా పెడుతున్నారు.