ఏపీ: అన్నకు ఝలక్కిచ్చిన షర్మిల... కడప సాక్షిగా ఓడిస్తాను?

Suma Kallamadi
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ఇరు పక్షాలు తమదైన రీతిలో ప్రచారాలు షురూ చేసాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూ, చెల్లెలు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలకూ మధ్య మాటల యుద్ధమే మహాభారతాన్ని తలపిస్తోంది. తాజాగా జాతీయ మీడియా ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ... కడప లోక్ సభ సీటులో తన సోదరి షర్మిలకు డిపాజిట్లు కూడా రావంటూ చేసిన వ్యాఖ్యలు గురించి అందరికీ తెలిసిందే. కాగా ఆ వ్యాఖలపైన తాజాగా షర్మిల స్పందిస్తూ అన్న జగన్ కు కౌంటర్లు వేశారు. నా అన్నకి తన సోదరిపై అంత బాధ ఉంటే అవినాష్ ను పోటీ నుంచి బేషరతుగా తప్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఇంకా ఆమె మాట్లాడుతూ... "అన్నకి భయం లేకపోతే కడపలో ఇంతమందిని ఎందుకు ప్రచారానికి దించుతున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే వైఎస్సార్ ఆడ బిడ్డ గురించి తప్పుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అన్న జగన్ కు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఈ అనైతిక చర్యలు చేపడుతున్నారు. ఒక దొంగ అయినటువంటి అవినాష్ రెడ్డికి మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే కడపలో పోటీ చేస్తున్నాను." అని ఆమె పలికారు. పెదనాన్న జార్జిరెడ్డి కొడుకులకో, లేదంటే చిన్నాన్న కొడుకులకి సీటు ఇచ్చి ఉంటే నేను ఇక్కడ పోటీ చేసేదాన్ని కాదని అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ... "బాబాయ్ ని హత్య చేసిన అవినాష్ కు టికెట్ ఇవ్వడం వల్లే నేను పోటీ చేయాల్సిన తప్పనిసరి వచ్చింది. వివేకా హత్య హార్ట్ అటాక్? ఎందుకైందో అన్న చెప్పాలి. సీబీఐ దర్యాప్తు కోరిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు దాన్ని పక్కన పడేశారు? ఈ విషయం మీరు తక్షణమే కడప ప్రజలకు చెప్పాలి. అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా చూస్తూ ఉరుకుంటున్నారు. ఐదేళ్లు నిందితుడిని కాపాడటం ఒకెత్తయితే మళ్లీ ఎంపీ టికెట్ ఎందుకిచ్చారో ఈరోజు కాకపోయినా రేపయినా చెప్పక తప్పదు!" అని ప్రశ్నించారు. ఆఖరిగా ఆమె మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో వైఎస్సార్ బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్లే అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: