పల్నాడు : జగన్ పై గిరిజనులు తీసుకున్న నిర్ణయం అదేనా ?
తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ యానాది కార్పొరేషన్ ఇస్తామని యానాదులకు హామీ ఇచ్చారన్నారు. యానాదులకు ఇచ్చిన హామీలను ఏమి అమలు చేశారో చెప్పి జగన్ మోహన్ రెడ్డి యానాదులు గిరిజనుల ఓట్లడగాలని సవాల్ చేశారు.జగన్ పాలనలో యానాదులు గిరిజనులలో సంక్షేమ పథకాలు లేక పేదరికం భారీగా పెరిగిపోయిందని జీవనోపాధి లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారని లక్షల ఇళ్లు ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతున్న జగన్ మోహన్ రెడ్డికి యానాదులు గిరిజనులు ఇప్పటికీ సక్రమంగా ఇళ్ళు లేక తీవ్ర ఇబ్బందులకు పడుతుంటే కనబడటం లేదని టిడిపి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో యానాదులు గిరిజనుల అభివృద్ధి జరుగుతుందని.సత్తెనపల్లిలో నీతి నిజాయితీకి మారుపేరు ప్రజాసేవ చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ గారిని ఎమ్మెల్యేగా ,ఎంపీగా విద్యావంతులు యువకుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారిని అఖండ మెజారిటీతో యానాదులు గిరిజనులు గెలిపించాలని పిలుపునిచ్చారు.యానాది సంఘాల అందరూ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వాలని శంకర్ ప్రసాద్ కోరారు.