తెలంగాణ : రైతు సమస్యలను తీర్చకపోతే ప్రభుత్వాన్ని వదలేదే లేదు... నామ నాగేశ్వరరావు..!

Pulgam Srinivas
రైతులు ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పంట నష్టపోయిన రైతులకు సత్వరమే ఎకరాకు 25 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని , ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అదనంగా ఇస్తానన్న 500 రూపాయలు బోనస్ ను తక్షణమే ఇవ్వాలని , మంచి నీటి ఎద్దడి లేకుండా సమస్యను పరిష్కరించాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ గౌతమ్ ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ... తాగు , సాగు నీటి ఎద్దడితో ప్రజలు ,  రైతులు చాలా కష్టపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని దుస్థితి నేడు దాపురించిందని ఆయన అన్నారు. రైతులకు ప్రస్తుతం ఎదురవుతున్న అన్ని సమస్యను పరిష్కరించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ... రైతుల కోసం ఎంతటి పోరాటానికి అయిన సిద్ధమని నామ తాజాగా స్పష్టం చేశారు. సాగునీరందక చేతికి వచ్చిన పంట ఎండిపోయిందని ,  వరి , మొక్కజొన్నకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని , ప్రభుత్వం వెంటనే సర్వే చేసి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి వెంటనే రైతులకు పరిహారం చెల్లించాలని నమా డిమాండ్ చేశారు.

ప్రతి ఎకరాకు రూ.25000 చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం జిల్లా వ్యాప్తంగా పర్యటించి వరి , మొక్కజొన్న తదితర పంటలు బాగా నష్టపోయినట్లు అంచనా వేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని సత్వరమే రైతులకు పరిహారం చెల్లించే విషయంలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరినట్టు ఈ సందర్భంగా నామ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ngr

సంబంధిత వార్తలు: