ఉత్తరాంధ్ర: టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా?

Purushottham Vinay
విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ సీటు ఎవరికి ఇస్తారు అన్న ఉత్కంఠను కోరి రాజేసింది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఇంచార్జ్ ఉన్నారు. ఆయన గత అయిదు సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. పార్టీ కూడా ఆయనను  నమ్మింది. అతన్ని జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా చేసింది.ఆయనే 2019 వ సంవత్సరంలో ఎన్నికల్లో టీడీపీ తరఫున చీపురుపల్లి లో పోటీ చేసిన కిమిడి నాగార్జున. తాజా ఎన్నికల్లో ఆయన పేరుని ఏ దశలో కూడా అధినాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం ఆయనతో పాటు ఆయన అనుచరులకు తీవ్ర మనస్థాపానికి గురి చేసింది.విశాఖ జిల్లా లో ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శ్రీకాకుళానికి చెందిన మరో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తో పాటు చాలా పేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. వారి పేర్లతోనే సర్వేని నిర్వహించారు. అయితే చివరికి ఈ సీటు కిమిడి కళా వెంకట్రావుకు వెళ్ళింది. తెలుగు దేశం పార్టీ తాజాగా రిలీజ్ చేసిన జాబితాలో ఆయన పేరు ఉంది.


అయితే ఆయన ఎవరో కాదు చీపురుపల్లి టికెట్ ని ఆశిస్తున్న కిమిడి నాగార్జునకు స్వయాన పెదనాన్న. అయితే ఆయనకు టికెట్ ఇస్తే అబ్బాయి సర్దుకుంటారు అని అంతా అనుకున్నారు.కానీ పేకాటలో రాజకీయాల్లో ఎలాంటి బంధాలు అనేవి ఉండవు. అదే నిజం చేస్తూ కిమిడి నాగార్జున తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా తనకు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిమిడి నాగార్జున తన పదవికి రాజీనామా చేశారు.యువకుడిగా ఉన్న నాగార్జునని పార్టీ గెలుపు కోసం వాడుకుంటూ ఆయనకే టికెట్ ఇచ్చి ఉండాల్సింది అని అనుచరులు అంటున్నారు. ఇష్టం లేకుండా చీపురుపల్లి వైపు వస్తున్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు నాగార్జున సహకారం దక్కకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. తెలుగుదేశం పార్టీని అయిదేళ్ళుగా నమ్ముకుని రాజకీయం చేస్తున్న వారికి యువతకు తెలుగు దేశం పార్టీ హై కమాండ్ ఇచ్చే విలువ ఇదేనా అని నాగార్జున అనుచరులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: