సిఏఏ బిల్లుపై ఇంకా విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక వర్గాన్ని టార్గెట్ చేసి తెచ్చిన చట్టం కావడంతో సహజంగా విమర్శలు వస్తున్నాయి.బీజేపీ తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయంగా దీనిని అభివర్ణిస్తున్నారు. దీనిపై ఓ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇక దాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది. యాంటీ ముస్లిం అంటూ దాన్ని అభివర్ణించింది. సీఏఏ చట్టం ముస్లింలకు ఎందుకు వ్యతిరేకమని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిర్ణయాలు సరి కాదని తెలియజేసింది.సీఏఏ ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. ఎవరి పౌరసత్వానికి కూడా భంగం వాటిల్లదు. అఫ్గాన్, పాకిస్థాన్ ఇంకా బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది ఈ చట్టం. దీనిపై అనవసరంగా ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారు. ఇది ముమ్మాటికి కూడా ఎవరిని ఉద్దేశించింది కాదని స్పష్టం చేసింది.సీఏఏ అమలుపై అన్ని వర్గాల నుంచి అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. ఏ మతానికి, వర్గానికి సంబంధించిన చట్టం కాదని బీజేపీ చెబుతున్నా కూడా వినిపించుకోవడం లేదు.
దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం చేసిన పనికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇంకా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో సీఏఏ అమలు ఇప్పుడు వివాదాస్పదంలో పడుతోంది. దీని అమలుకు చాలా రాష్ట్రాలు కూడా అభ్యంతరం చెబుతున్నాయి.ఈ సీఏఏ చట్టం అమలు పరచడంలో అనేక రాష్ట్రాలు మొగ్గు చూపడం లేదు. ఇక ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలు చేయమని తెగేసి చెప్పడం జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సీఏఏ అమలు చేయమని స్పష్టం చేశారు. దీంతో ఈ సీఏఏ అమలు ప్రశ్నార్థకంగా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం బీజేపీ వేసిన పాచికగా చెబుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి ఉద్దేశించిన పథకంలో భాగంగానే ఈ సీఏఏ తీసుకొచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో సీఏఏ అమలు ఆచరణ సాధ్యం కాదని సమాచారం తెలుస్తోంది.