హైదరాబాద్ : జగన్ పై కొండా కాలుదువ్వుతున్నారా ?

Vijaya


ఏమాత్రం స్ధిరత్వంలేని రాజకీయనేతల్లో కొండా సురేఖ కూడా ఒకళ్ళు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సురేఖ ఒకపుడు దివంగత వైఎస్సార్ కు స్ట్రాంగ్ సపోర్టర్ అన్న విషయం తెలిసిందే. తర్వాత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత ఏమైందో వైసీపీ నుండి బయటకు వచ్చేసి జగన్ కు వ్యతిరేకంగా మారారు. జగన్-షర్మిల గొడవలు రోడ్డున పడినపుడు షర్మిలకు వ్యతిరేకంగా చాలాసార్లు సురేఖ మాట్లాడారు.



అలాంటిది ఇపుడు ఏమైందో తెలీదు సడెన్ గా షర్మిలకు మద్దతుగా మాట్లాడారు. జగన్ కు వ్యతిరేకంగా షర్మిల తరపున తాను ఏపీలో కూడా ప్రచారం చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. జగన్ రెండోసారి గెలిస్తే ఏపీ నాశనమైపోతుందన్నట్లుగా శాపనార్ధాలు పెడుతున్నారు. జగన్ అంటే అంతగా మండిపోవటానికి కారణం ఏమిటో ఆమెకే తెలియాలి. ఒకపుడు పూర్తిగా వ్యతిరేకించిన షర్మిలకు ఇపుడు ఎందుకింత మద్దతుగా నిలబడుతున్నారో కూడా కొండాయే చెప్పాలి.



సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే తెలంగాణా మంత్రి కొండా సురేఖ ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఏమవుతుంది ? అసలు ఏపీలో సురేఖ అంటే ఎంతమందికి తెలుసు ? ఆమెను పట్టించుకునే వారెవరు ? ఏపీ రాజకీయాల్లో షర్మిల పరిస్ధితి అయోమయంగా ఉంది. అలాంటిది షర్మిల తరపున ప్రచారంచేస్తే సురేఖకు వచ్చే లాభం ఏమిటో ఆమెకే తెలియాలి. ఏదో తెలంగాణాలో కాంగ్రెస్ మంత్రి కాబ్టటి ఏపీలో కాంగ్రెస్ కు మద్దతుగా  ప్రచారం చేస్తారంటే అంతవరకు ఓకే.



అంతేకాని తన ప్రచారంతో కాంగ్రెస్ ను గెలిపించేస్తాను, జగన్ను అధికారంలో నుండి దింపేస్తానని ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం నవ్వులపాలయ్యేది సురేఖ మాత్రమే.  ఏపీలో ప్రచారానికి తనకు అధిష్టానం అనుమతి రావాలట. అనుమతి వస్తుంది, సురేఖ ఏపీలో ప్రచారంచేస్తారు. ఎందుకంటే దీనికి పెద్దగా కష్టపడాల్సింది ఏమీలేదు. ఏపీలో ప్రచారం చేయటమంటే జగన్ను నోటికొచ్చినట్లు తిట్టడం, చేతనైనంతగా బురదచల్లేయటమే కదా చేసేది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: