హరిహర వీరమల్లు: టీజర్ సూపర్.. కానీ టెన్షన్లో ఫ్యాన్స్?

Purushottham Vinay
పవర్ స్టార్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఈరోజు పొద్దున టీజర్ రిలీజ్ అయ్యి బాగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉందని చాలా రోజులుగా అనేక రకాల కథనాలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.అయితే ఆ బాధ్యతను ఎవరు తీసుకున్న కూడా ప్రాజెక్టు తగ్గట్టుగా న్యాయం చేయడం అనేది మాత్రం అంత మామూలు విషయమైతే కాదనే కామెంట్స్ కూడా వినిపించాయి. చారిత్రాత్మక కథను డీల్ చేయాలి అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టర్ క్రిష్ వల్లే సాధ్యం అవుతుంది.అయితే ఊహించని విధంగా నేడు టీజర్ విడుదల చేసిన మేకర్స్ క్రిష్ తో పాటు మరొక దర్శకుడు పేరుని కూడా హైలెట్ చేయడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అది కూడా ఇప్పటి దాకా మినిమం సక్సెస్ చూడని జ్యోతి కృష్ణ పేరు ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జ్యోతి కృష్ణ చిత్ర నిర్మాత ఏఏం రత్నం పెద్ద కుమారుడు. 2003 వ సంవత్సరంలో తరుణ్ హీరోగా నటించిన 'నీ మనసు నాకు తెలుసు' అనే సినిమా ద్వారా జ్యోతి కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు.ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ఆ తరువాత తన తమ్ముడు రవికృష్ణ తోనే కేడి అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.


ఇక 2017లో గోపీచంద్ తో ఆక్సిజన్  రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజనన్ కి కూడా అతనే డైరెక్టర్. ఈ సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొత్త డైరెక్టర్ చేసినా కూడా ఫ్యాన్స్ అంతగా టెన్షన్ పడేవారు కాదేమో కానీ ఇప్పటి దాకా మినిమమ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయని జ్యోతికృష్ణ ను డైరెక్ట్ చేయడం ఏమిటో అనేలా సందేహాలు బాగా వ్యక్తమవుతున్నాయి. సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇక క్రిష్ హఠాత్తుగా అనుష్కతో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయడంతో వీరమల్లు పరిస్థితి ఏమిటి అనేది ఎవరికి అర్థం కాలేదు.ఇక తప్పని పరిస్థితుల్లో నిర్మాత రత్నం ఈ 150 కోట్ల ప్రాజెక్టును కొడుకు చేతిలో పెట్టాడు. ఇక రెండు భాగాలుగా ఉంటుంది అంటున్నారు కాబట్టి మరో భాగాన్ని పూర్తిగా అతనే డీల్ చేసేలా ఉన్నాడు. ఏది ఏమైనా వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పటి దాకా అలాంటి జానర్ టచ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్, నిర్మాత ఆ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: