సునీల్ ఛేత్రి రిటైర్మెంట్.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
మనదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ ఏ ఆటకి లేదు. క్రికెటర్లను ఏకంగా దేవుళ్ళ లాగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఇలా క్రికెట్ కి ఉన్న పిచ్చి క్రేజ్ కారణంగా ఎంతో మంది ప్రతిభగల ఆటగాళ్లు ఇక తెరమీదకి రాకుండానే కనుమరుగైపోయారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ప్రపంచ క్రీడా సమాజంలో లెజెండ్స్ తో సమానంగానే రికార్డులు సాధించినప్పటికీ ఎందుకో ఇండియాలో మాత్రం తగిన గుర్తింపును సంపాదించుకోలేకపోయారు. అలాంటి వారిలో ఇక భారత ఫుట్బాల్ టీం కెప్టెన్ సునీల్ చెత్రి ఒకరు.

 ఇండియాలో క్రికెట్ కి ఎలా అయితే క్రేజ్ ఉందో అటు విదేశాలలో ఫుట్బాల్ ఆటకి ఆ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇక ఎవరైనా ఆటగాడు ఒక మ్యాచ్లో మంచి ప్రదర్శన చేశాడు అంటే చాలు అతని పేరు మారుమోగిపోతూ ఉంటుంది. అతని ఆటోగ్రాఫ్ కోసం కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ భారత్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఫుట్బాల్ ఆటలో ఎంతోమంది దిగ్గజాలలో  సునీల్ చౌదరి కూడా ఒకరు. కానీ భారత్ లో అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏకంగా భారత్ తరపున 150 మ్యాచ్ లు ఆడిన అతను 94 గోల్స్ సాధించాడు. ప్రపంచంలోనే ఇది నాలుగో అత్యధిక గోల్స్ స్కోర్ కావడం గమనర్హం.

 అయిన అతనికి తగిన గుర్తింపు రాలేదు. అయితే ఇక ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు సునీల్ చెత్రి రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా కొంతమంది క్రీడాభిమానులు అతని ప్రతిభను ప్రశంసిస్తున్నారు. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో జూన్ ఆరవ తేదీన కువైట్ తో జరిగే మ్యాచ్ తనకు చివరిది అంటూ తెలిపాడు సునీల్ చెత్రి. అయితే ఇక సునీల్ చేత్రి రిటైర్మెంట్ పై భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. అతనొక గొప్ప ఆటగాడు.. రిటైర్మెంట్ కు ముందు నేను తనకు మెసేజ్ చేశాను. అంత బాగుండాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు కోహ్లీ.  కాగా గత కొన్ని రోజుల నుంచి సునీల్ చెత్రి కోహ్లీ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: