ఢిల్లీ లిక్కర్ స్కామ్తో జగన్కు లింక్ ఉందా?
అయితే దీనికి బదులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈమధ్య జగన్మోహన్ రెడ్డిని గట్టిగా టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే అరబిందో క్రెడింట్ ట్రెమ్ ఫార్మా లో జగన్మోహన్ రెడ్డికి 49% వాటా ఉందని వీళ్లు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా లక్షతో ప్రారంభమైన ఇండో సోల్ సోలార్ కు 76 వేల కోట్ల ప్రాజెక్టులు రావడం ఇవన్నీ,గమనిస్తే జగన్ కు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలు ఈ విషయాన్ని హైలైట్ చేసుకుంటూ చెప్పుకొస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు విన్న వాళ్లు, తెలిసిన వాళ్ళు కొంత మంది ఇది సంబంధం లేని ఆరోపణ అని అంటున్నారట ఒక పక్క. అయితే ఇదే నిజమైతే సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు వేయొచ్చు. సిబిఐకి కూడా ఈ స్కాం విషయంలో సజెస్ట్ చేయొచ్చు. కానీ ఇదంతా ఎందుకని అంటే చంద్రబాబు నాయుడుని ఇప్పుడు అవినీతిపరుడు అని వాళ్ళు నిరూపిస్తున్నారు కాబట్టి.
వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పై ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొంతమంది అంటున్న మాట. సిమెన్ సంస్థ, డిజైన్ టెక్ సంస్థ అలానే స్కిల్లర్ అనే సంస్థ ఇవన్నీ బోగస్ కంపెనీలే. అయితే వీటిని బడా కంపెనీలుగా చూపిస్తూ అరబిందో లాంటి బడా కంపెనీని తక్కువ చేసి చూపిస్తున్నారు వీళ్ళు.