పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల వివరాలు ఇవే..!
ఇకపోతే వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి లోక్సభ, రాజ్యసభ రోజుకు ఐదేసి గంటల పాటు.. వేర్వేరు సమయాల్లో నడుస్తాయని తెలుస్తుంది. ముందుగా లోక్ సభ ఫిబ్రవరి 1 న ఉదయం 11 కు
అలాగే మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకూ రెండో దశ సెషన్ల ను మొదలు కానున్నాయి. కాగా, గత ఏడాది తో పోలిస్తే సమావేశం సమయం ను కుదించినట్లు తెలుస్తుంది. పార్లమెంట్ పనివేళల గురించి మరో బులిటెన్ ను లోక్సభ సచివాలయం విడుదల చేసింది. సెట్రల్ హాల్ నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కోవిడ్ దృష్ట్యా లోక్సభ, రాజ్య సభ సభ్యులు భౌతిక దూరం పాటించేలా సభలొని సీట్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈ నెల 31 నుంచి సమావేశాలు వేడేక్కనున్నాయి.. మరి ఎ శాఖకు ఎంత బడ్జెట్ ను కేటాయిస్తారో చూడాలి..