బండి సంజయ్ ఎందుకు సైలెంట్...?
పార్టీ వ్యవహారాల విషయంలో ఈ మధ్యకాలంలో కిషన్ రెడ్డి అలాగే ధర్మపురి అరవింద్ ఎక్కువగా జ్యోక్యం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకులతో మాట్లాడటమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకొని పార్టీ బలోపేతానికి కాస్త ముందు అడుగు వేస్తూ ఉండగా బీజేపీ లోకి వచ్చి కొంత మంది నాయకుల విషయంలో ధర్మపురి అరవింద్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న పార్టీలోకి తీసుకు నేందుకు కాస్త ధర్మపురి అరవింద్ ఎక్కువగా జోక్యం చేసుకోవడం అలాగే ఢిల్లీలో ధర్మపురి అరవింద్ కు అన్ని విధాలుగా రక్షణ కల్పించి బీజేపీ జాతీయ నాయకత్వం సమక్షంలో ఆయనను పార్టీలో తీసుకోవడం వంటివి బాగా హైలైట్ అయ్యాయి.
అయితే ఈ వ్యవహారంలో బండి సంజయ్ పెద్దగా కనపడక పోవటంతో అసలైన ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఏంటి అనేది ఆ పార్టీ నాయకత్వానికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం ధర్మపురి అరవింద్ అదేవిధంగా కిషన్రెడ్డి ఎక్కువగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయడానికి కూడా సిద్ధం కావడంతో బండి సంజయ్ పాదయాత్ర దాదాపుగా వాయిదా పడింది అనే ప్రచారం కూడా తెలంగాణ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.