తడబడిందెవరు.. మంత్రా.. ఎమ్మెల్యేనా.. వైసీపీలో గుసగుస..!
గత ఎన్నికలకుముందు.. సీఎం జగన్ తన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారన్న సతీష్కుమార్.. దీనిలో మత్స్యాకారులకు డీజిల్పై పన్ను ఎత్తేస్తామని.. కూడా హామీ ఇచ్చారని.. అందుకే.. వారు గుండుగు త్తుగా.. వైసీపీకి మద్దతుగా నిలిచారని.. ఆయన పేర్కొన్నారు. అయితే.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. రెండున్నరేల్లు అయినప్పటికీ.. ఈ విషయంలో సదరు హామీలను అమలు చేయలేదని.. ఆయన సభలో నే స్పష్టం చేశారు. మరి ఇప్పటికైనా.. మత్స్యకారులకు న్యాయం చేస్తారో.. లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దీనిపై మంత్రి సీదిరి అప్పలరాజు.. ఆసక్తిగా స్పందించారు.
అసలు.. మీరు.. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల గురించి అందరికీ తెలుసునని.. కానీ.. మీరు .. మాత్రం ఆసక్తిగా మాట్లాడుతున్నారని.. సీదిరి అన్నారు. అంతేకాదు.. అసలు.. మత్స్యకారులకు డీజిల్ పై ఎలాంటి హామీలు ఇవ్వలేదని.. రాయితీలు ఇస్తామని కూడా చెప్పలేదని.. ఈ విషయం సభ్యులు తెలుసుకోవాలని.. పొన్నాడకు సభలోనే చురకలు అంటించారు.
అయితే.. మత్య్సకారులకు 45 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తున్నామని.. అదేవిధంగా వసతి దీవెన, విద్యాదీవెన.. అమ్మ ఒడిని.. వారికి కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో పొన్నాడ కిమ్మనకుండా కూర్చున్నారు. అయితే.. ఈ విషయం ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ప్రశ్న అడిగిన పొన్నాడకు నవరత్నాలపై అవగాహన లేదా.?? లేక.. మంత్రిని ఇబ్బంది పెట్టాలని భావించి ఇలా ప్రశ్నించారా? అనే ప్రశలు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హల్చల్ చేస్తున్నాయి.