భారత్ పై.. మారిన ప్రపంచ దృష్టి.. !
ఇక ప్రాంతీయ సంస్థల విషయానికి వస్తే వాళ్ళు కూడా భారీగానే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ ఏడాదిలో కూడా లక్షలలో ఉద్యోగులను తీసుకోవడానికి సిద్ధం అయ్యాయి ఆయా సంస్థలు. టీసీఎస్, విప్రో, హెచ్సి ఎల్ సంస్థలు 2021 కి గాను 54000 మంది ఫ్రెషర్స్ ను తీసుకున్నారు. 2022లో కూడా ఈ సంస్థలు 160000 మందిని తీసుకోనున్నారు. చైనా వ్యవహారాల నేపథ్యంలో భారత్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి, దీనితో భారీగా మానవ వనరులు కూడా అవసరం పడుతుంది. ఐఫోన్ అసెంబ్లీ యూనిట్ చెన్నై లో ప్రారంభించారు. ఇదే సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా అడుగుపెట్టింది. ఇది 2024లోగ పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఈ వాహనాలు 700 కి.మీ. ప్రయాణించే సామర్థ్యంతో అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు 2021యునికార్న్ స్టార్ట్ అప్ ల ప్రారంభంలో కూడా భారత్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. వీటివిలువ ఒక బిలియన్ డాలర్లుగా ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. ఇలాంటివి భారత్ లో 33 ప్రారంభించగా, చైనాలో 19 మాత్రమే ప్రారంభం అయ్యాయి. అయినా చైనాలో సంక్షోభం వలన అవి కూడా ముందుకు సాగె పరిస్థితి కనిపించడం లేదు. అంటే భారత్ వేగంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తూ పోతుంది. దానికి ప్రస్తుత పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి.