యూపీకి.. కాశ్మీర్ తీవ్రవాదుల తరలింపు..!
దీనిద్వారా యూపీలో ఉగ్రనేతలకు తెలిసిన వారు ఉండరు కాబట్టి వాళ్ళ ఆగడాలు సాగవు. ఏమైనా ఎక్కువ చేస్తే, వాళ్ళను యోగి ప్రభుత్వం కాల్చి పారేస్తుందనే ఉద్దేశ్యంతో అక్కడకు మార్చారు. అంటే కాశ్మీర్ లో ఉన్న అధికారులు భయం లేదా మతం లాంటివి అడ్డుపెట్టుకొని పాక్ చెప్పింది చేయడం అలవాటు పడ్డారు. ఆ స్థితిలో అక్కడ పరిస్థితిని సరిదిద్దటం సాధ్యం కానిపని అందుకే కేంద్రం ఈ తరహా నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇకమీదట కాశ్మీర్ లో ఏ తీవ్రవాద నేత పట్టుబడ్డా అతడిని వేరే ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు.
తద్వారా ఈ నేతలు స్లీపర్ సెల్స్ ను కాంటాక్ట్ అయ్యే అవకాశాలు బాగా తగ్గినట్టే. భారత్ ఒకపక్క చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేసుకుంటూ, మరోపక్క పాక్ కాశ్మీర్ ను ఆక్రమించకుండా చూసుకుంటూ, అలాగే దేశంలో పొంచి ఉన్న స్లీపర్ సెల్స్ ను యాక్టీవ్ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాసేపు ఆపినా దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఈ మూడు దారులు సిద్ధంగా ఉన్నాయి. తద్వారా భారత్ ను కోలుకోలేని దెబ్బ తీయాలన్నది వాళ్ళ వ్యూహం. కరోనా సమయంలో భారత్ అనూహ్యంగా అందరికంటే ముందుగా బయట పడటాన్ని వీరందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఎప్పుడెప్పుడు భారత్ ను దెబ్బతీద్దామా అని గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారు. అందుకే భారత్ ప్రతివిషయంలో ఆచి తూచి అడుగులు వేయాల్సి వస్తుంది.