ఒడిశా కాంగ్రెస్ లో కలకలం
ఇదీల ఉండగా మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ తన రాజీనామా లేఖ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి పంపించాడు. తాను కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం చాలా బాధ గా ఉందని అన్నాడు. తాను చివరి వరకు కాంగ్రెస్ పార్టీ లోనే ఉండి ప్రజా సేవ చేయాలని అనుకున్నాను అని తెలిపాడు. సోనియా గాంధీ నాయకత్వం మెరుగ్గా ఉన్న కొంత మంది నాయకుల వల్ల పార్టీ రోజు రోజు కు క్షిణిస్తుందని తెలిపాడు. ఇప్పటికే ఒడిశా లో పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని అన్నారు. మళ్లి ప్రజల మద్దత్తు తిరిగి సంపాదించడానికి చాలా సమయం పడుతుందని లేఖ లో వివరించాడు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల కు చాలా సేవలు చేశానని గుర్తు చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇటు రాష్ట్రంలో అటు అధిష్టానంలో ఉత్తేజం తగ్గి పొయిందని అన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ ఎంపీ ప్రదీప్ త్వరలోనే ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో బీజేడీ లో చేరుతారని సమాచారం.