కాంగ్రెస్లో గాడ్సే గ్యాంగ్.. కండువా కప్పి మరీ..
ఈ క్రమంలోనే కాంగ్రెస్లో బాబూలాల్ చేరగానే అనేక విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో బాబూలాల్ పాల్గొన్న అనేక కార్యక్రమాలను గుర్తు చేస్తూ అనేకమంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 2017 నవంబర్ 15న గాడ్సే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడంపై బాబూలాల్ వివరణ ఇచ్చారు. నిజానికి తాను బలవంతంగా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని, తనపై జరిగిన కుట్ర వల్ల తాను అక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ సమావేశంలో గాడ్సే నుంచి తాను ఎంతో నేర్చుకున్నాని బాబూలాల్ పేర్కొన్నారు. 2018 డిసెంబర్ 11న జరిగిన మరో కార్యక్రమంలో కూడా బాబూలాల్ పాల్గొన్నారు.
‘హిందూ మహాసభ నాపై కుట్ర పన్ని నన్ను ఆ కార్యక్రమంలో ఉండేలా చేసింది. గాడ్సే విగ్రహంపై నీళ్లు పోసి నివాళి అర్పించమని కొందరు నాతో సైగ చేశారు. కానీ మాజీ కాంగ్రెస్ నేతనైన నేను గాడ్సేకు ఎలా మద్దతుగా ఉండగలను? అందుకే అక్కడే వారికి కుదరదని తేల్చి చెప్పాను’ అని బాబూలాల్ చెప్పుకొచ్చారు. అయితే బాబూలాల్ సమాధానాలతో ఇప్పటికీ కాంగ్రెస్లో అనేకమంది సంతృప్తి చెందినట్లు లేదు. ఇంకా కొంతమంది ఆయన చేరికను వ్యతిరేకిస్తుండడమే దీనికి కారణం. మరి కమల్ నాథ్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.