కామంతో ఊగిపోయిన టీచర్.. బాలికను ఎవరు లేని రూంలోకి తీసుకెళ్లి..?

praveen
ఈ మధ్య కాలంలో అభం శుభం తెలియని ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. రోజు రోజుకు రెచ్చి పోతున్న కామాంధులు ఆడపిల్ల కనిపిస్తేచాలు అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారిపోయాడు. కామం తో కళ్లు మూసుకు పోయి ఏకంగా తన వద్ద చదువుకునే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

 అంతటితో ఆగకుండా ఉన్మాదిగా మారిపోయిన ఉపాధ్యాయుడు ఇక ఆ చిన్నారికి విషం ఇచ్చి దారుణంగా హత్య చేశాడు.  ఇక బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఉపాధ్యాయుడి కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన జార్ఖండ్లో చోటు చేసుకుంది.  పాలమౌ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలికపై  ఆమె చదువుతున్న పాఠశాలలో పనిచేస్తున్న శంభు సింగ్ అనే 35 ఏళ్ల ఉపాధ్యాయుడు కన్నేశాడు.  ఇటీవలే పాఠశాలకు వెళ్లిన బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్థానని బెదిరించాడు.

 కేవలం బాలికను  మాత్రమే కాదు అటు బాలిక తల్లిదండ్రులను కూడా నిందితుడు బెదిరించాడు. ఆ తర్వాత బాలిక ఈ విషయం ఎక్కడ బయటికి చెబితే తనకు శిక్ష పడుతుందో అని భయంతో ఇక బాలిక ఇంట్లోకి వెళ్లి.. బలవంతంగా బాలికతో విషపు  మాత్రలు తినిపించాడు. ఇక బాలిక తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా  ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.అయితే ఉపాధ్యాయుడికి సదరు బాధిత కుటుంబానికి గతంలో ఓ భూమి విషయంలో వివాదం ఉంది అన్న విషయం పోలీసు విచారణలో తేలడం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: