క్రిస్మస్ నాడు ఇళ్ల పట్టాల పంపిణి ప్రారంభించబోతున్న జగన్..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. జగన్ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం జరిగింది. ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాల్లో ఈ పధకం ఒకటి. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది ఉగాది పర్వదినాన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని.. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించాలని జగన్ సర్కారు ప్రయత్నాలు చేసింది. కానీ కరోనా, కోర్టు పిటిషన్ల కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ రావడం జరిగింది.
 ‘ఇళ్ల పట్టాల’ పంపిణీ రేపు ప్రారంభం కాబొతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. 15 లక్షల ఇళ్ల పనులను సైతం ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా కె.కొత్తపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. మిగతా చోట్ల మంత్రులు హాజరవుతారట.ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు.. ఈ కార్యక్రమాన్ని ఆపలేమని పిటిషనర్‌ ప్రసాద్ బాబుకు స్పష్టం చేసింది.
పిటిషన్ అభ్యంతరాలను తోసిపుచ్చింది.డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ సాధ్యమవుతోంది. రూ.23,535 కోట్ల మార్కెట్ విలువ గల 68,361 ఎకరాల భూమిని డిసెంబర్ 25 నుంచి 15 రోజులపాటు పంపిణీ చేయబోతున్నారు.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రాజకీయ వార్తలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: