గ్రేటర్ యుద్ధం : రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ
మరొక పక్క అధికార టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాలు సాధించగా ఎంఐఎం పార్టీ 42 స్థానాల్లో స్థిరంగా ఉంది. ఇక భారీ ఎత్తున సీట్లు లభించడంతో బిజెపి పార్టీ ఆఫీస్ వద్ద సంబరాలు జరుగుతున్నాయి. పార్టీకి సంబంధించిన అగ్ర నేతలు అందరూ ఒక్కరొక్కరుగా నాంపల్లిలో ఉన్న స్టేట్ మెయిన్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. ఇప్పటి దాకా టిఆర్ఎస్ భవన్ వద్ద నెలకొన్న కోలాహలం అంతా బీజేపీ ఆఫీస్ కి షిఫ్ట్ అయిందా అన్నట్టు ఉంది పరిస్థితి.
ప్రస్తుతానికి ఆఫీస్ వద్దకు చేరుకున్న బండి సంజయ్ ని కార్యకర్తలు భుజాల మీద ఉరేగిస్తూ లోపలికి తీసుకు వెళ్లారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక ఇప్పటి వరకు 142 డివిజన్లో ఫలితాలు వెలువడగా అందులో యాభై ఆరు సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నలభై ఆరు సీట్లు బిజెపి కైవసం చేసుకుంది 42 స్థానాలకు ఎం ఐ ఎం పరిమితం అయింది. ఇక కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలు మాత్రమే ఫిక్స్ అయిపోయిందని చెప్పాలి. కేవలం మరో నాలుగు స్థానాలకు మాత్రమే ఫలితాలు వెలువడాల్సి ఉంది.