ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !
ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ‘కల్చర్ ఆఫ్ పీస్’ అనే అంశంపై చర్చ జరిగింది. ఐరాస శాశ్వత మిషన్లో భారత తరఫున తొలి కార్యదర్శి ఆశిశ్ శర్మ ఈ చర్యల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచంలో అసహనం, ద్వేషం, హింస, ఉగ్రవాదం అనేవి ఒక నియమంగా మారిపోయాయని ఆశిశ్ శర్మ అన్నారు. హింసను ప్రేరేపించడంలో ఉగ్రవాదం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారత్లో కొందర్ని పావులుగా వాడుకొని పాక్ ఉగ్రకార్యకలాపాలకు కూడా పాల్పడుతోందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ దేశంలోని మైనార్టీలపైనా నిరంకుశంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. ‘పాకిస్థాన్ మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకపోతే.. దక్షిణాసియా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శాంతిని స్థాపించగలం’ అని ఆశిశ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. భారత్లోని కొందర్ని పావులుగా వాడుకొని.. పాక్ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. ఆ దేశంలోని మైనార్టీలపైనా నిరంకుశంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతోందని ఆరోపించారు.